News June 26, 2024
ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. కేంద్రానికి ₹11వేలకోట్ల రెవెన్యూ
కేంద్రం నిన్న ప్రారంభించిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ఈరోజు ముగిసింది. ఏడు రౌండ్లు జరగగా భారతీ ఎయిర్టెల్ ఎక్కువ బ్యాండ్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 900 MHz, 1800 MHz, 2100 MHz బ్యాండ్లకు డిమాండ్ నెలకొందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 800 MHz, 2500 MHz, 26 GHz, 3.3 GHz బ్యాండ్లపై ఎవరూ ఆసక్తి కనబరచలేదని తెలిపాయి. కాగా ఈ ఆక్షన్ ద్వారా కేంద్రానికి ₹11,300కోట్ల నికర ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.
Similar News
News October 10, 2024
బ్రూక్&రూట్.. WORLD RECORD
పాక్తో తొలి టెస్టులో అదరగొట్టిన బ్రూక్(317), రూట్(262) వరల్డ్ రికార్డ్ సాధించారు. విదేశీ గడ్డపై ఏ వికెట్కైనా అత్యధిక పార్ట్నర్షిప్(454) నమోదు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. 1934లో బ్రాడ్మన్&పోన్స్ఫోర్డ్(AUS) ఇంగ్లండ్పై 451 స్కోర్ చేయగా, 90 ఏళ్లకు ఆ రికార్డును బ్రూక్&రూట్ బద్దలుకొట్టారు. 3,4,5 స్థానాల్లో అటపట్టు&సంగక్కర 438(vsZIM), జయవర్దనే&సమరవీర 437(vsPAK), డిప్పెనార్&రుడాల్ఫ్(vsBAN) ఉన్నారు.
News October 10, 2024
రూ.500 కోట్ల విరాళాలు ఏం చేశారు?: అవినాశ్
AP: వరద బాధితులందరికీ తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలంటూ NTR(D) YCP అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో VJAలో నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు వల్లే బుడమేరు వరదలు వచ్చాయని అవినాశ్ ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద పరిహారం కోసం బాధితులు పడిగాపులు కాస్తున్నారన్నారు. రూ.500 కోట్ల విరాళాలు ఏం చేశారని ప్రశ్నించారు. తమకు కావాల్సిన వారికే కూటమి నేతలు పరిహారం ఇచ్చారని, అర్హులను గాలికొదిలేశారని మండిపడ్డారు.
News October 10, 2024
Stock Market: స్వల్ప లాభాలతో గట్టెక్కాయి
స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 144 పాయింట్ల లాభంతో 81,611 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 24,998 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్లో 82,000 వద్ద ఉన్న రెసిస్టెన్స్ అడ్డుగోడలా పనిచేయడంతో సూచీ ముందుకు కదల్లేదు. అటు నిఫ్టీలోనూ 25,135 వద్ద Day Highని సూచీ దాటలేదు. Kotak Bank, JSW Steel, HDFC, BEL టాప్ గెయినర్స్. Cipla, Techm, Trent, Sun Pharma టాప్ లూజర్స్.