News April 13, 2025
5MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించిన మంత్రి

కాటారం మండలం ధన్వాడ సబ్ స్టేషన్లో వేసవి కాలంలో పెరుగుతున్న లోడ్ కోసం, అదనపు 5MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ను రూ.కోటితో అంచనా వేసి, ఆ ట్రాన్స్ఫార్మర్ పనులు ఇటీవల పూర్తి చేశారు. ఆదివారం రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, మండల విద్యుత్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News November 9, 2025
CII సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి కొండపల్లి

AP: రాష్ట్రాన్ని మాన్యూఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో MSME ఎగుమతుల అభివృద్ధి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘IT రంగంలోనూ విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది. MSME విభాగంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోంది. CII సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఏపీపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది’ అని పేర్కొన్నారు.
News November 9, 2025
ఈనెల 11న సీఎం వర్చువల్ శంకుస్థాపనలు: కలెక్టర్

జిల్లాలో పలు ప్రాజెక్టులకు ఈ నెల 11న సీఎం చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆర్డీవోలు, ఏపీఐఐసీ, ఎయిర్పోర్ట్, టూరిజం అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి లబ్ధిదారులు, స్టేక్హోల్డర్లతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండేలా సక్రమ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News November 9, 2025
ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుంది: మంత్రి కొండపల్లి

విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సును ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సదస్సుకు 16 దేశాల నుంచి 44 మంది డెలిగేట్లు హాజరయ్యారు. ఏపీని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. MSMEలకు ఇప్పటికే రూ.439 కోట్ల మేర ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.


