News June 5, 2024

6న విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన

image

కార్పొరేట్ కళాశాలల పథకం ద్వారా ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఒరిజినల్ ధృవపత్రాలను ఈ నెల 6న పరిశీలించనున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకొని సీజీజీ-ఈపాస్ నుండి మెసేజ్ వచ్చిన విద్యార్థులు తమ ఒరిజినల్ ధృవపత్రాలతో ఈనెల 6న ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు.

Similar News

News November 25, 2025

ఖమ్మం బీఆర్‌ఎస్‌లో గ్రూపు తగాదాలు..!

image

ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయన్న చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో గ్రూపు తగాదాలను ఆపకుంటే పార్టీకి భారీ నష్టం తప్పదని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News November 25, 2025

19 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి

image

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న 19మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించింది. సీపీ సునీల్ దత్ మంగళవారం వారికి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. వీరిలో నలుగురిని మహబూబాబాద్‌కు, 14 మందిని భద్రాద్రి కొత్తగూడెంకు, ఒకరిని ఇతర విభాగానికి కేటాయించారు.

News November 25, 2025

ఖమ్మం కార్పొరేషన్‌లో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల హవా!

image

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికార కాంగ్రెస్ కార్పొరేటర్ల కంటే బీఆర్‌ఎస్ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మున్సిపల్ కాంట్రాక్టులు, ఎల్‌ఆర్‌ఎస్ పనులలో అధికారులు వారికే సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నిర్మాణాలపై, రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది.