News January 14, 2025
ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం: మంత్రి

TG: రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. దీని వల్ల ప్రభుత్వంపై రూ.12వేల కోట్ల వరకూ భారం పడుతుందన్నారు. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ లబ్ధిదారులకు ఒకొక్కరికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులను ఈనెల 26 నుంచి జారీ చేయనున్నారు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


