News March 28, 2025
ఏపీలో బర్డ్ఫ్లూతో 6 లక్షల కోళ్లు మృతి: అంతర్జాతీయ సంస్థ

APలోని 8 ప్రాంతాల్లో బర్డ్ఫ్లూ విజృంభించినట్లు పారిస్కు చెందిన వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వెల్లడించింది. కోళ్ల ఫామ్స్తో పాటు ఇంట్లో పెంచుకునే కోళ్లకూ ఇది సోకిందని తెలిపింది. రాష్ట్ర తూర్పు ప్రాంతాల్లో H5N1 ఎక్కువగా విస్తరించినట్లు పేర్కొంది. దీనివల్ల 6,02,000 కోళ్లు చనిపోయినట్లు వివరించింది. కాగా ఇటీవల ఉ.గోదావరి, కృష్ణా, NTR జిల్లాల్లో బర్డ్ఫ్లూ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Similar News
News October 22, 2025
ట్రాన్స్కో, జెన్కోలో మరో 6 నెలల పాటు సమ్మెలపై నిషేధం

AP: రాష్ట్ర పవర్ కార్పొరేషన్లలో మరో 6 నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ట్రాన్స్కో పరిధిలోని మూడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో, జెన్కోలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. నవంబర్ 10 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వివరించింది. కాగా ఇంతకు ముందు మే 10 నుంచి నవంబర్ 9 వరకు వర్తించేలా సమ్మె నిషేధ జీవో ఇచ్చింది. తాజాగా గడువు పొడిగించింది.
News October 22, 2025
రానున్న 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 12 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో పయనించి వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. అటు భారీ వర్షసూచన నేపథ్యంలో రేపు కూడా నెల్లూరు జిల్లాలోని స్కూళ్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
News October 22, 2025
ఆసియా కప్ను నేనే ఇస్తా: మోహ్సిన్ నఖ్వీ

ఆసియా కప్ను భారత్కు తానే అప్పగిస్తానని ACC ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ట్రోఫీని భారత్కు అప్పగించాలని నఖ్వీకి BCCI లేఖ రాసింది. ‘ఒక వేడుక ఏర్పాటు చేస్తాం. BCCI ఆఫీస్ హోల్డర్, విన్నింగ్ టీమ్లో అందుబాటులో ఉన్న ఏ ప్లేయర్తోనైనా వచ్చి ట్రోఫీ కలెక్ట్ చేసుకోండి’ అని నఖ్వీ చెప్పినట్లు GEO న్యూస్ పేర్కొంది. ఈ విషయాన్ని ICC వద్దే తేల్చుకోవాలని BCCI ఫిక్సైనట్లు తెలుస్తోంది.