News September 20, 2024
పట్టాలపై 6 మీటర్ల ఇనుప స్తంభం.. తప్పిన ప్రమాదం

లోకో పైలట్ అప్రమత్తతతో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఉత్తరాఖండ్లోని రుద్రపూర్ వద్ద పట్టాలపై 6 మీటర్ల ఇనుప స్తంభం ఉన్నట్లు జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ లోకో పైలట్ గుర్తించాడు. ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేసి రైలును ఆపేయడంతో ప్రమాదం తప్పింది. పోల్ తీసేసిన తర్వాత రైలు అక్కడి నుంచి ముందుకు కదిలింది. కాగా ఇటీవల పట్టాలపై రాళ్లు, సిమెంట్ దిమ్మెలు, సిలిండర్లు ఉంచిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
Similar News
News December 24, 2025
యాసంగి అవసరాలకు యూరియా సిద్ధం: మంత్రి తుమ్మల

తెలంగాణలోని రబీ సీజన్ అవసరాల కోసం ఇప్పటికే 5 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే జనవరి, ఫిబ్రవరి అవసరాలకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్, జనగామ, మహబూబ్నగర్, నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా యూరియా యాప్ అమలు చేస్తున్నామని, 2 రోజుల్లోనే 19,695 మంది రైతులు 60,510 యూరియా బస్తాలను కొనుగోలు చేశారని తెలిపారు.
News December 24, 2025
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం మరమ్మతులపై ముందడుగు

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో ఏర్పడిన పగుళ్లు, ఇతర లోపాల మరమ్మతులకు ముందడుగు పడింది. ఈ బ్యారేజీలపై డీపీఆర్ను ప్రభుత్వం సిద్ధం చేయిస్తోంది. ఈ పనిని ఆర్వీ అసోసియేట్స్కు అప్పగిస్తోంది. అటు తుమ్మిడిహట్టి DPRను కూడా ఇదే సంస్థ రూపొందిస్తోంది. ఈ రిపోర్టును 3నెలల్లో అందించాలని గడువు విధించింది. ఇది రాగానే పనులకు టెండర్లు పిలిచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
News December 24, 2025
ఇలాంటి వారితో కలిసి భోజనం చేయకూడదట..

గరుడ పురాణం ప్రకారం.. కొందరి ఇంట్లో భోజనం చేయడం అశుభమని పండితులు చెబుతున్నారు. నేరస్థులు, క్రూరులతో కలిసి ఆహారం తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ తీసుకుంటే వారి పాపాల్లో మనం కూడా భాగస్వాములం అవుతామట. అలాగే దేవుడిని విమర్శించేవారు, నాస్తికులతో కూడా కలిసి తినొద్దట. వారి ప్రతికూల ఆలోచనలు మనపై ప్రభావం చూపుతాయని, అవి కష్టాలకు దారితీస్తాయని నమ్మకం. స్వచ్ఛమైన మనసున్నవారి ఇంట్లో భోజనం చేయడం శ్రేయస్కరం.


