News December 12, 2024
6 నెలలుగా మాయమాటలతో పబ్బం గడుపుతున్నారు: YCP

AP: కూటమి ప్రభుత్వ 6 నెలల పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని YCP ఆరోపించింది. ‘అలవికాని హామీలిచ్చి గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. జనాన్ని మాయమాటలతో గందరగోళ పర్చి 6 నెలలుగా పబ్బం గడుపుతున్నారు’ అని సూపర్-6 హామీలను డస్ట్ బిన్లో పడేసిన ఫొటోను షేర్ చేసింది. గత ఐదేళ్లుగా అమలైన పథకాలు, వ్యవస్థలన్నీ రద్దయ్యాయని పేర్కొంది.
Similar News
News February 7, 2026
ఈ 3 దేశాల్లో ఇంటర్నెట్ ఉన్నా లేనట్టే!

EAలోని ఎరిట్రియా, N.కొరియా, CAలోని తుర్క్మెనిస్తాన్ దేశాల్లో ఇంటర్నెట్ లిమిటెడ్గా ఉంటుంది. భద్రతా కారణాలతో టెలికాంలపై ఎరిట్రియా, N.కొరియా ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఎరిట్రియాలో ప్రభుత్వ పర్యవేక్షణలోని కెఫేలపై పౌరులు ఆధారపడతారు. నా.కొరియాలో SM వాడటంపై నిషేధం. తుర్క్మెనిస్తాన్లో SM, వార్తలు, ఫారిన్ సైట్స్ను ప్రభుత్వం బ్యాన్ చేసింది. VPNల సపోర్ట్తో వాడుతున్నా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
News February 7, 2026
ఇస్లామాబాద్లో దాడి చేసింది మేమే: ఐసిస్

పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన <<19072203>>ఆత్మాహుతి దాడి <<>>తమ పనేనని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించింది. ‘మసీదులోకి వెళ్లేందుకు యత్నించిన మా ఫైటర్ను గార్డులు అడ్డుకున్నారు. దీంతో ప్రజలు గుమిగూడిన చోట అతడు తనను తాను పేల్చేసుకున్నాడు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అటాక్ చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదాన్ని ఓడించాలనే తమ సంకల్పానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
News February 7, 2026
ఇలాంటి సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

గాఢ సేంద్రియ ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.


