News December 12, 2024
6 నెలలుగా మాయమాటలతో పబ్బం గడుపుతున్నారు: YCP

AP: కూటమి ప్రభుత్వ 6 నెలల పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని YCP ఆరోపించింది. ‘అలవికాని హామీలిచ్చి గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. జనాన్ని మాయమాటలతో గందరగోళ పర్చి 6 నెలలుగా పబ్బం గడుపుతున్నారు’ అని సూపర్-6 హామీలను డస్ట్ బిన్లో పడేసిన ఫొటోను షేర్ చేసింది. గత ఐదేళ్లుగా అమలైన పథకాలు, వ్యవస్థలన్నీ రద్దయ్యాయని పేర్కొంది.
Similar News
News February 3, 2026
అమరావతికి చట్ట, న్యాయ రక్షణ ఉండాలి: SA రిపోర్టు

AP: అమరావతి రాజధానికి చట్ట, న్యాయ రక్షణ ఉండాలని తాజాగా విడుదలైన సోషల్ ఆడిట్ రిపోర్టు స్పష్టం చేసింది. ‘ఇంత పెద్ద స్కేల్ ప్రాజెక్టుపై రాజకీయాలు లేదా ఇతర ప్రభావాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అది స్థానికుల జీవనోపాధిపై దుష్ప్రభావం చూపుతుంది. వారి జీవితాలను దెబ్బతీస్తుంది’ అని పేర్కొంది. రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయాలంది. రోజువారీ కూలీపై ఆధారపడి ఉన్న భూమిలేని వారిని ఆదుకోవాలని సూచించింది.
News February 3, 2026
Airtel: ఉచిత AI ఆఫర్ ఇక ఉండదు

ప్రముఖ టెలికం సంస్థ Airtel తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో ఇస్తున్న ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్ ఆఫర్ను నిలిపివేసింది. ఇకపై రీఛార్జ్ చేసే వినియోగదారులకు Perplexity AI ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందుబాటులో ఉండదని కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ పరిమిత కాలానికే వర్తిస్తుందని ముందుగానే తెలిపింది. అయితే ఇప్పటికే ఆఫర్ను క్లెయిమ్ చేసుకున్న వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ పేర్కొంది.
News February 3, 2026
లోక్సభలో గందరగోళం.. వాయిదా

అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్పై పార్లమెంటులో విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దీంతో లోక్సభలో గందరగోళం చెలరేగింది. స్పీకర్ ముందు ఉన్న టేబుల్ ఎక్కి విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లాపైకి పేపర్లు విసిరారు. దీంతో ఆయన సభను గంటపాటు వాయిదా వేశారు. అటు పార్లమెంటు బయట కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.


