News April 11, 2024
ఇజ్రాయెల్కు 6 వేల మంది భారత కార్మికులు

నిర్మాణ రంగ పనుల కోసం భారత్ నుంచి 6000 మంది భారత కార్మికులు ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. ఏప్రిల్, మే నెలల్లో వీరిని ప్రత్యేక విమానాల్లో అక్కడికి తరలించనున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఇజ్రాయెల్లో పనిచేసే పాలస్తీనా కార్మికులను ఆ దేశం పంపించింది. వీరి స్థానంలో భారత్తో పాటు మరికొన్ని దేశాల నుంచి కార్మికులను రప్పించుకుంటోంది. వీరికి భారీ జీతాలు ఇవ్వనున్నట్లు సమాచారం.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


