News April 1, 2024

6 నుంచి సమ్మెటివ్ ఎగ్జామ్స్

image

AP: ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో సమ్మెటివ్-2 పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1-9 తరగతులు, ప్రైవేటులో 6-9 తరగతులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి ప్రశ్నపత్రాలను అందిస్తుంది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతి ఆధారిత మదింపు(CBA) ఎగ్జామ్ నిర్వహిస్తారు. దీనికి ప్రశ్నపత్రంతో పాటు OMR షీట్ కూడా ఇస్తారు. ప్రైవేట్ పాఠశాలలకు క్వశ్చన్ పేపర్ మాత్రమే అందిస్తారు.

Similar News

News March 24, 2026

యుద్ధం.. బీర్లు తాగేవారికి షాక్!

image

దేశంలో బీర్ల ధరలు పెరుగుతాయని, సరఫరాకు కొరత ఏర్పడొచ్చని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(BAI) తెలిపింది. ‘యుద్ధం వల్ల తయారీ ఖర్చు 12-15% పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ధరలు ఉన్నాయి’ అని పేర్కొంది. సీసాల ధరలు 20%, మెటీరియల్స్ రేట్లు 20-25%, రవాణా ఖర్చులు 10% పెరిగాయి. BAIలోని యునైటెడ్ బ్రూవరీస్, కార్ల్స్‌బర్గ్, AB InBev తదితర కంపెనీలు దేశంలో 85% బీర్లు అమ్ముతున్నాయి.

News March 24, 2026

సినీ పరిశ్రమ అభివృద్ధిపై CM CBNతో సంజయ్ దత్ భేటీ

image

AP: CM CBNతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, షూటింగ్‌లకు APని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఉన్న అవకాశాలపై చర్చ జరిగింది. సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంజయ్ దత్ వివరించారు. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నాయని CM తెలిపారు.

News March 24, 2026

పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌ గడువు పెంచలేం: SC

image

AP, TGల్లో మిగిలిన 623 PG మెడికల్ సీట్ల భర్తీపై PVT కాలేజీలకు SCలో చుక్కెదురైంది. దీనికి సంబంధించిన పిటిషన్లను కొట్టివేసింది. ఇప్పటికే ఏడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా గడువు కోరడం సమంజసం కాదని అభిప్రాయపడింది. అకడమిక్ క్యాలెండర్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే దీనిపై కాలేజీలు కేంద్రాన్ని సంప్రదించొచ్చని సూచించింది. కేంద్రం మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.