News September 1, 2024

6 రైళ్లు రద్దు, 9 రైళ్లు దారిమళ్లింపు

image

TG: మహబూబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఇవాళ నడవాల్సిన 6 రైళ్లను అధికారులు రద్దు చేశారు. శాతవాహన, గోల్కొండ, గుంటూరు-సికింద్రాబాద్, కాగజ్‌నగర్ఇంటర్ సిటీ రైళ్లను రద్దు చేశారు. కోణార్క్, గరీబ్‌రథ్ , చార్మినార్, విశాఖ-LTT తదితర 9 రైళ్లను దారిమళ్లించారు. పలు రైల్వే స్టేషన్లలో అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. పైన ఫొటోలో నంబర్లు చూడవచ్చు.

Similar News

News October 26, 2025

టాస్ గెలిచిన భారత్

image

WWC: లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్‌లో BANతో భారత్ తలపడుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన IND బౌలింగ్ ఎంచుకుంది. వర్షం పడుతుండటంతో ఆట కాస్త ఆలస్యమవనుంది.
IND: ప్రతీకా, స్మృతి, హర్లీన్, రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్(C), దీప్తి, ఉమా, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీచరణి, రేణుకా
BAN: సుమియా, రుబ్యా హైదర్, షర్మిన్, శోభన, సుల్తానా(C), షోర్నా, మోని, రబేయా, నహిదా, నిషితా, మరుఫా

News October 26, 2025

నారద భక్తి సూత్రాలు – 8

image

నిరోధస్తు లోకవేదవ్యాపార వ్యప:
మనం చేసే సాధారణ పనులైనా, దేవుడికి సంబంధించిన పనులైనా.. వాటి ఫలితం గురించి ఆలోచించకుండా ‘దేవుడా! నీ కోసమే చేస్తున్నాను’ అని వాటిని ఆయనకు అప్పగించాలని ఈసూత్రం సూచిస్తోంది. ఫలితంగా మన మనసులో ఆందోళన, స్వార్థం పోతాయని, మన ప్రతి పని దైవసేవగా మారుతుందని చెబుతోంది. ‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం వదిలి ‘అంతా దేవుడే చేయిస్తున్నాడు’ అనే నమ్మకంతో ఉండటమే ఈ సూత్ర సారాంశం. <<-se>>#NBS<<>>

News October 26, 2025

విషాదం: మట్టిపెళ్లలు విరిగిపడతాయని పంపిస్తే..

image

కేరళలోని ఇడుక్కి జిల్లాలో దంపతులను దురదృష్టం వెంటాడింది. NH-85 విస్తరణ పనుల్లో భాగంగా మన్నంకందంలో కొండను తవ్వుతున్నారు. మట్టిపెళ్లలు విరిగిపడే అవకాశం ఉందని 22 కుటుంబాలను నిన్న సాయంత్రం రిలీఫ్ క్యాంపులకు తరలించారు. అయితే రాత్రికి భోజనం కోసం బిజు(48), సంధ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సమయంలో మట్టి, బురద ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. బిజు చనిపోగా, సంధ్య తీవ్రంగా గాయపడ్డారు.