News October 17, 2024

34కే 6 వికెట్లు.. నలుగురు డకౌట్

image

NZతో తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ బ్రేక్ సమయానికి 34 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. భారత్ ఇన్నింగ్సులో నలుగురు ప్లేయర్లు (కోహ్లీ, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా) డకౌట్ అయ్యారు. ప్రస్తుతం పంత్ (15*) క్రీజులో ఉన్నారు. విలియం 3, హెన్రీ 2, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.

Similar News

News October 17, 2024

STOCK MARKETS క్రాష్.. రూ.3 లక్షల కోట్లు ఆవిరి

image

భారత స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్ కొనసాగుతోంది. నెగటివ్ సెంటిమెంటుతో బెంచ్‌మార్క్ సూచీలు క్రాష్ అవ్వడంతో రూ.3 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మధ్యాహ్నం బీఎస్ఈ సెన్సెక్స్ 80,952 (-548), ఎన్ఎస్ఈ నిఫ్టీ 24,740 (-231) వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్ ఆటో ఇంట్రాడేలో 12% నష్టపోయింది. ఆటో షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ విపరీతంగా ఉంది. Infy, TechM, LT, SBIN, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్.

News October 17, 2024

భారత్ చెత్త రికార్డు

image

కివీస్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే చాపచుట్టేసింది. ఇది టీమ్ ఇండియాకు మూడో అత్యల్ప స్కోరు. 2020లో 36(vsAUS), 1974లో 42(vsENG) పరుగులకు ఆలౌటైంది. ఆయా టెస్టుల్లో థర్డ్ ఇన్నింగ్సులో లోయెస్ట్ స్కోరుకు కుప్పకూలగా, సొంత గడ్డపై తొలి ఇన్నింగ్సులో భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరు. స్వదేశంలో ఒక ఇన్నింగ్సులో ఐదుగురు డకౌట్ కావడం 25 ఏళ్లలో ఇదే తొలిసారి.

News October 17, 2024

ఉప్పల్ స్టేడియం కేసులో ఈడీ దూకుడు

image

TG: ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్‌మాల్ కేసులో 3కంపెనీలకు ED సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న అజారుద్దీన్‌ను విచారించిన ED, ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బాడీడ్రెంచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్స్‌లెంట్ ఎంటర్‌ప్రైజెస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఆదేశించింది. జనరేటర్స్, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, ఇతర వస్తువుల్లో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.