News November 11, 2024
60 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

ఖమ్మంలోని తెల్దారుపల్లిలో దాదాపు 60ఏళ్లకు సీపీఎం నాయకత్వాన్ని కోల్పోయింది. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2019తర్వాత సీపీఎంపై తిరుగుబాటు ఎగురవేసిన తమ్మినేని కృష్ణయ్య ఆయన భార్యను ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత పరిణామాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కృష్ణయ్య కుమారుడు కాంగ్రెస్లో చేరారు. ఈ క్రమంలో పార్టీ గ్రామకమిటీని ఇటీవల ఎన్నుకున్నారు.
Similar News
News November 12, 2025
వెలుగుమట్లలో సైనిక్ స్కూల్ అర్హతల పరిశీలన

ఖమ్మం జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలనలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పిపిపి మోడ్లో దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఖమ్మంలో దరఖాస్తు చేసిన ఈ పాఠశాల అర్హతను కమిటీ పరిశీలన ఆధారంగా నిర్ణయిస్తుందని అన్నారు.
News November 12, 2025
ఖమ్మం: దివ్యాంగుల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సాధికారిత రాష్ట్ర పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్రెడ్డి తెలిపారు. అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఆన్లైన్లో ఉన్న దరఖాస్తు ఫారాలు, మార్గదర్శకాలను ఉపయోగించుకోవాలని కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు కార్యాలయంలో సమర్పించాలి.
News November 12, 2025
ఖమ్మం: బోనస్పై అనుమానం.. కొనుగోళ్లలో జాప్యం

ఖమ్మం జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. గతంలో విక్రయించిన ధాన్యానికి బోనస్ ఇంకా జమ కాకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. మద్దతు ధరతో పాటు బోనస్ రావాలంటే కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాల్సి ఉన్నా, బోనస్పై అనుమానంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడానికి మొగ్గు చూపుతున్నారు.


