News August 30, 2024

60 టీఎంసీలకు చేరిన శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 60 టీఎంసీలకు చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 8,503 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాగా ప్రాజెక్ట్ నుంచి వివిధ కాల్వల ద్వారా 4,425 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1085.10 అడుగుల (60.118 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

Similar News

News November 25, 2025

26న BRS సన్నాహక సమావేశం: జీవన్ రెడ్డి

image

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈనెల 29న నిర్వహించనున్న ‘దీక్షా దివస్‌’ను విజయవంతం చేయడానికి నిజామాబాద్‌లో ఈ నెల 26న సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 ఒక మైలురాయి లాంటిదని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందని ఆయన గుర్తు చేశారు.

News November 25, 2025

నిజామాబాద్ జిల్లాలో అతివలే కీలకం

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు విడుదల చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాలో మొత్తం 8,51,417 మంది ఓటర్లు ఉండగా మహిళలు 4,54,621 మంది ఉన్నారు. ARMR డివిజన్లో 1,95,092 మంది, BDN డివిజన్లో 1,21,591 మంది, NZB డివిజన్లో 1,46,938 మంది మహిళలు ఉన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పురుషులు 3,96,778 మంది ఉన్నారు. ఇతరులు 18 మంది ఉన్నారు.

News November 25, 2025

NZB జిల్లాలో ఎవరికి ఎన్ని సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు అంటే?

image

నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. 100% ST GP ల్లో ST (W) -33, ST(Gen) 38, నాన్ షెడ్యూల్ ఏరియాల్లో ST(W) 8, ST(Gen) 17, SC(W) 35, SC (Gen) 47, BC(W) 55, BC (Gen) 70, అన్ రిజర్వ్డ్ పంచాయతీల్లో మహిళలకు 113, పురుషులకు 129 వార్డులను రిజర్వ్ చేసినట్లు అధికారులు తెలిపారు.