News July 17, 2024

600 మంది విద్యార్థినీలకు ఒకటే మరుగుదొడ్డి!

image

నల్గొండ జిల్లాలోని సర్కారు పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో 1250 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 600 మంది విద్యార్థినీలు, 15 మంది మహిళా టీచర్లు ఉన్నారు. వీరందరికీ ఒకటే మరుగుదొడ్డి ఉండడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

Similar News

News January 5, 2026

NLG: మండలాల్లో అటకెక్కిన ప్రజావాణి

image

NLGలో ప్రజావాణికి వినతులు వెల్లువెత్తడంతో, గత ప్రభుత్వం మండల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే అనేక మండలాల్లో ప్రజావాణి కార్యక్రమం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మొదట్లో మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల్లో కొద్దిరోజులు నిర్వహించినప్పటికీ, ప్రస్తుతం అన్ని చోట్లా నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులు తమ సమస్యల పరిష్కారం కోసం తిరిగి జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

News January 5, 2026

NLG: అమ్మ బాబోయ్.. కేజీ రూ.300లా!

image

నల్గొండ జిల్లాలో చికెన్ రేటు ట్రిపుల్ సెంచరీ కొట్టింది. కిలో మాంసం రూ.300కి చేరడంతో మాంసం ప్రియులు బెంబేలెత్తుతున్నారు. గుడ్డు ధర రూ.8.50 ఉండగా.. లైవ్ కోడి రూ.185, స్కిన్‌లెస్ రూ.290-310 పలుకుతోంది. బర్డ్ ఫ్లూతో ఉత్పత్తి తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. పండగ పూట ముక్క లేకపోతే ఎలా అని మాంసం ప్రియులు వాపోతుండగా, రేట్లు ఇప్పట్లో దిగిరావని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News January 5, 2026

NLG: అమ్మ బాబోయ్.. కేజీ రూ.300లా!

image

నల్గొండ జిల్లాలో చికెన్ రేటు ట్రిపుల్ సెంచరీ కొట్టింది. కిలో మాంసం రూ.300కి చేరడంతో మాంసం ప్రియులు బెంబేలెత్తుతున్నారు. గుడ్డు ధర రూ.8.50 ఉండగా.. లైవ్ కోడి రూ.185, స్కిన్‌లెస్ రూ.290-310 పలుకుతోంది. బర్డ్ ఫ్లూతో ఉత్పత్తి తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. పండగ పూట ముక్క లేకపోతే ఎలా అని మాంసం ప్రియులు వాపోతుండగా, రేట్లు ఇప్పట్లో దిగిరావని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.