News April 1, 2025
జొమాటోలో 600 మంది ఉద్యోగులు ఔట్

ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో తన ఉద్యోగులకు షాకిచ్చింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్గా పనిచేస్తున్న దాదాపు 600 మందిని తొలగించింది. ఈ విభాగంలో ఏడాది కిందట 1,500 మందిని నియమించుకోగా, ఇంతలోనే పలువురికి లేఆఫ్స్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పేలవమైన పనితీరు, ఆలస్యంగా రావడం వంటి కారణాలు చూపుతూ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే తొలగించినట్లు సిబ్బంది వాపోతున్నారు.
Similar News
News April 3, 2025
మారుతీ కార్లు కొనేవారికి షాక్

ఏప్రిల్ 8 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. మోడల్ను బట్టి రూ.2,500 నుంచి రూ.62,000 వరకు ఈ పెంపు ఉంటుందని తెలిపింది. ముడి సరకుల ధరలు, ఆపరేషనల్ కాస్ట్ పెరగడం, కార్లలో మెరుగైన ఫీచర్స్ ఇందుకు కారణమని తెలిపింది. మోడళ్లపై ధరల పెరుగుదల ఇలా ఉంది. SUV Fronx-Rs.2500, Dzire Tour S-Rs.3000, XL6, Ertiga-Rs.12,500, Wagon R-Rs.14000, Eeco van-Rs.22,500, SUV Grand Vitara-Rs.62,000.
News April 3, 2025
IPL: టాప్-3లో ధోనీ, కోహ్లీ, రోహిత్

మార్చిలో Xలో అత్యధికంగా ప్రస్తావించిన ఐపీఎల్ ప్లేయర్ల లిస్టులో CSK మాజీ కెప్టెన్ ధోనీ తొలి స్థానంలో నిలిచారు. నెటిజన్లు గత నెలలో ఆయన గురించే ఎక్కువగా చర్చించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, SRH హిట్టర్ ట్రావిస్ హెడ్ ఉన్నారు.
News April 2, 2025
అదంతా అబద్ధం: సూర్య కుమార్

<<15971972>>జైస్వాల్తో పాటు<<>> తాను కూడా ముంబై నుంచి గోవా జట్టుకు మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సూర్య కుమార్ యాదవ్ ఖండించారు. ‘మీరు జర్నలిస్టులా? స్క్రిప్ట్ రైటర్లా? నేను కామెడీ సినిమాలు చూడటం మానేసి ఇక నుంచి మీ ఆర్టికల్స్ చదువుతా’ అంటూ X వేదికగా స్పందించారు. సూర్యతో పాటు మరికొంత మంది క్రికెటర్లు గోవా జట్టులో చేరుతారని, HYD క్రికెటర్ తిలక్ వర్మనూ గోవా క్రికెట్ అసోసియేషన్ సంప్రదించినట్లు వార్తలొచ్చాయి.