News November 14, 2024
ఒక్కో విద్యార్థికి రూ.6,000.. ఉత్తర్వులు జారీ

AP: తమ నివాసానికి దూరంగా ఉన్న GOVT పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్ రూ.13.53 కోట్లు విడుదల చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉత్తర్వులిచ్చింది. దీంతో రాష్ట్రంలోని 22,558 మందికి లబ్ధి చేకూరనుంది. ఒక్కో విద్యార్థికి రూ.6వేల చొప్పున అందించనుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం KM దూరంలో ప్రాథమిక, 3KM లోపల ప్రాథమికోన్నత, 5KM దూరంలో ఉన్నత పాఠశాలలు ఉండాలి. లేదంటే ట్రావెల్ అలవెన్స్ చెల్లించాలి.
Similar News
News January 25, 2026
FDDIలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని ఫుట్వేర్ డిజైన్ & డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (<
News January 25, 2026
కళ్లు తాజాగా ఉండాలంటే..

ముఖంలో ఆకర్షణీయంగా ఉండేవి కళ్లే.. కానీ ప్రస్తుతం మారిన జీవన విధానంలో కళ్లు జీవం కోల్పోయినట్లు అవుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే రోజులో కనీసం నాలుగైదు సార్లైనా కళ్లను చన్నీటితో కడగాలంటున్నారు నిపుణులు. కళ్లకు తరచూ విశ్రాంతినివ్వాలి. సరిపడా నిద్ర లేకపోయినా కంటి ఆరోగ్యం ప్రభావితమవుతుంది. నిద్రలేమి వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, గీతలు, ముడతలు ఏర్పడతాయి. నాణ్యమైన ఐ మేకప్ ఉత్పత్తులు వాడాలి.
News January 25, 2026
ఉసిరిలో కాయకుళ్లు, నల్లమచ్చ తెగుళ్ల నివారణ

కాయకుళ్లు తెగులు సోకిన ఉసిరి కాయలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వాటి నుంచి చెడువాసన వస్తుంటుంది. దీని నివారణకు కాయలను నిల్వ ఉంచే ముందు 2 శాతం ఉప్పు ద్రావణంలో కానీ లేదా 1% బోరాక్స్ మిశ్రమంలో కానీ ముంచి తీయాలి. ఉసిరిలో నల్లమచ్చ తెగులు వల్ల కాయలపై నల్ల మచ్చలు చిన్నవిగా ఏర్పడి క్రమంగా పెద్దవి అవుతాయి. తెగులు కట్టడికి లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ను తొలకరి చినుకులు పడిన వెంటనే పిచికారీ చేయాలి.


