News April 13, 2025

61 డాట్స్.. 30,500 మొక్కలు నాటాం: KKR

image

CSKతో మ్యాచ్‌లో 61 డాట్ బాల్స్ వేసిన KKR 30,500 మొక్కలను నాటినట్లు ప్రకటించింది. అలీ, నరైన్, వరుణ్, హర్షిత్, వైభవ్ మొక్కలను నాటుతున్నట్లు రూపొందించిన ఫొటోను షేర్ చేసింది. ఒక ఇన్నింగ్సులో ఇన్ని డాట్స్ వేయడం IPL చరిత్రలోనే తొలిసారి. దీంతో చెపాక్ స్టేడియంలో చెట్లతో నిండిపోయిన మీమ్స్ వైరలయ్యాయి. కాగా పర్యావరణ సంరక్షణలో భాగంగా ఒక్కో డాట్‌కు 500 చెట్లు నాటే కార్యక్రమానికి 2023లో BCCI శ్రీకారం చుట్టింది.

Similar News

News December 2, 2025

పగిలిపోయిన దేవతా విగ్రహాలను పూజించవచ్చా?

image

పగిలిన దేవతా మూర్తుల విగ్రహాలు, చిరిగిన పటాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల భక్తి భావన తగ్గే అవకాశాలు ఉంటాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘అలాంటి విగ్రహాలు, చిత్రపటాలను పారే నీటిలో నిమజ్జనం చేయాలి. లేకపోతే ఏదైనా దేవాలయం చెట్టు మొదలులో ఉంచాలి. కాగితపు పటాలు అయితే, వాటిని అగ్నికి ఆహుతి చేసి, ఆ బూడిదను నీటిలో కలిపి చెట్ల మొదట్లో పోయడం ఉత్తమ మార్గం’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 2, 2025

ఇతిహాసాలు క్విజ్ – 84 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: ఐదు ముఖాల రూపం కలిగి, చిరంజీవిగా బ్రహ్మదేవునిచే వరం పొంది, యుద్ధంలో శారీరకంగా పాల్గొనకపోయినా ధర్మసంస్థాపనకు కారణమైంది ఎవరు?
సమాధానం: హనుమంతుడు. ఆయన పంచముఖుడు. చిరంజీవిగా బ్రహ్మదేవుడి వరం పొందాడు. యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో ప్రత్యక్షంగా ఆయుధం ధరించి పాల్గొనలేదు. కానీ, పరోక్షంగా, అత్యంత ముఖ్యమైన రీతిలో సహాయం అందించి, ధర్మసంస్థాపనకు కారణమయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 2, 2025

శబరి వెళ్లిన ప్రతి ఒక్కరూ 18 మెట్లు ఎక్కవచ్చా?

image

శబరిమలలో 18 పవిత్ర మెట్లను ముక్తికి సోపానాలుగా భావిస్తారు. ఇవి మనలోని 18 పాపపుణ్యాలు, విద్య, ఇంద్రియాలను సూచిస్తాయని నమ్మకం. వీటిని మండల కాల దీక్షా వ్రతం పూర్తిచేసినవారు మాత్రమే ఇరుముడి ధరించి, ‘స్వామియే శరణమయ్యప్ప’ అంటూ అధిరోహిస్తారు. దీక్ష ధరించకుండా, ఇరుముడి లేకుండా వచ్చిన భక్తులు ఈ మెట్లకు ప్రక్కన ఉన్న సాధారణ మెట్ల మార్గం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. <<-se>>#AyyappaMala<<>>