News May 12, 2024

6,100 మందిపై బైండోవర్ కేసులు: మన్యం ఎస్పీ

image

జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. 1150 మంది సిబ్బంది,6 కంపెనీల కేంద్ర బలగాలను, 56 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు,138 మంది సెక్టార్ అధికారులను నియమించామన్నారు. చెప్పారు. 6,100 మందిపై బైండోవర్ నమోదు చేశామన్న ఆయన..అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు జిల్లా విడిచి వెళ్లాలని స్పష్టం చేశారు.

Similar News

News February 9, 2025

VZM: మద్యం షాపుల లాటరీ వాయిదా

image

ఈనెల 10న విజయనగరంలో జరగాల్సిన కల్లుగీత, సొండి కులాలకు కేటాయించిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి బి.శ్రీ నాథుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో లాటరీ ప్రక్రియ వాయిదా పడిందన్నారు. ఎలక్షన్ కమిషన్ అనుమతులు వచ్చిన వెంటనే లాటరీ తేదీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

News February 9, 2025

చీపురుపల్లి అమ్మవారి జాతరకు ముహూర్తపురాట

image

చీపురుపల్లి మేజర్ పంచాయతీలో వెలసిన ఉత్తరాంధ్ర కల్పవల్లిగా పూజించే శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి జాతరకు తొలి ఘట్టం మొదలైంది. ఆలయ ప్రాంగణంలో ఈవో బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం ముహూర్తపురాట వేశారు. ఈవో మాట్లాడుతూ.. మార్చి నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు అమ్మవారి జాతరను నిర్వహిస్తున్నామన్నారు. జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

News February 9, 2025

VZM: ‘అనుమతులు లేకుండా పశు మాంసం విక్రయించొద్దు’

image

విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో పశు మాంసం అమ్మే వ్యాపారులతో 1వ పట్టణ పోలీసులు శనివారం సమావేశం నిర్వహించారు. ట్రేడ్ లైసెన్సు‌తో పాటు అన్ని అనుమతులు ఉన్నవారు మాత్రమే పశు మాంసాన్ని విక్రయించాలని, అనుమతులు లేకుండా పశువులను వధించడం, రవాణా చేయడం చట్ట ప్రకారం నేరమన్నారు. చట్ట వ్యతిరేకంగా పశువుల వధించడం, రవాణా చేసినట్లయితే వారిపై కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు.

error: Content is protected !!