News January 31, 2025
6,100 కానిస్టేబుల్ పోస్టులు.. BIG UPDATE

APలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన PET, PMT పరీక్షలు నిన్నటితో ముగిశాయి. 69K మంది హాజరవగా దాదాపు 39K మంది అర్హత సాధించినట్లు PRB ఛైర్మన్ రవిప్రకాశ్ తెలిపారు. వీరికి MAR చివరి వారం లేదా APR ఫస్ట్ వీక్లో తుది రాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోంగార్డుల రిజర్వేషన్పై హైకోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. కాగా ఈ పోస్టులకు 2023 FEBలో 4.90L మంది ప్రాథమిక పరీక్ష రాశారు.
Similar News
News November 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 70 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
సమాధానం: మారుత్ అంటే సంస్కృతంలో వాయువు అని అర్థం. ఆ వాయు దేవుడి పుత్రుడు కాబట్టే ఆంజనేయ స్వామిని మారుతి అని అంటారు. హనుమంతుడు వాయు శక్తి, వేగాన్ని కలిగి ఉంటాడు. ఆయన ఆకాశంలో పయనించేటప్పుడు, ఆయన వేగం, శక్తి వాయువుతో సమానం. అలా వాయు శక్తిని తనలో నిక్షిప్తం చేసుకున్న దివ్య స్వరూపుడిగా ఆయన్ను మారుతిగా కీర్తిస్తారు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 18, 2025
‘N-Bomma VS J-Bomma’ టీడీపీ, వైసీపీ విమర్శలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం iBOMMA గురించి చర్చ నడుస్తోంది. ఇదే థీమ్తో వైసీపీ, టీడీపీలు ట్విట్టర్ వార్కు దిగాయి. J-Bomma అంటూ జగన్ ఫొటోను షేర్ చేస్తూ TDP విమర్శలకు దిగింది. దీనికి కరెక్టెడ్ టూ N-Bomma అంటూ చంద్రబాబు ఫొటోను YCP కౌంటర్ ట్వీట్ చేసింది. నరహంతకుడు, శాడిస్ట్ చంద్రబాబు అంటూ రాసుకొచ్చింది.
News November 18, 2025
బనకచర్ల పేరు మార్చి అనుమతులకు ఏపీ యత్నం: ఉత్తమ్

SC స్టే ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని TG మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎత్తు పెంచొద్దని కోర్టు చెప్పిందన్నారు. కేంద్ర మంత్రి CR పాటిల్తో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ‘పోలవరం-బనకచర్లను వ్యతిరేకించాం. పేరు మార్చి AP అనుమతులకు యత్నిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కోరాం’ అని మంత్రి వివరించారు.


