News January 31, 2025
6,100 కానిస్టేబుల్ పోస్టులు.. BIG UPDATE

APలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన PET, PMT పరీక్షలు నిన్నటితో ముగిశాయి. 69K మంది హాజరవగా దాదాపు 39K మంది అర్హత సాధించినట్లు PRB ఛైర్మన్ రవిప్రకాశ్ తెలిపారు. వీరికి MAR చివరి వారం లేదా APR ఫస్ట్ వీక్లో తుది రాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోంగార్డుల రిజర్వేషన్పై హైకోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. కాగా ఈ పోస్టులకు 2023 FEBలో 4.90L మంది ప్రాథమిక పరీక్ష రాశారు.
Similar News
News November 12, 2025
AP న్యూస్ రౌండప్

* స్వచ్ఛ కార్యక్రమాల అమలులో విశాఖ పోర్టు అథారిటీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ముంబైలో కేంద్ర మంత్రి సర్బానంద చేతుల మీదుగా పోర్టు ఛైర్మన్ అంగముత్తు అవార్డు స్వీకరించారు.
* రేపటి నుంచి సత్యసాయి శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. 19న PM మోదీ, 22న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, 23న రాష్ట్రపతి ముర్ము హాజరుకానున్నారు.
* వర్సిటీలన్నింటికీ ఒకే చట్టం తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు తుదిదశకు చేరుకుంది.
News November 12, 2025
అయోడిన్ లోపంతో పిల్లల్లో ఎదుగుదల సమస్యలు

థైరాయిడ్ హార్మోన్లు, ట్రైయోడోథైరోనిన్ (T3), థైరాక్సిన్ (T4) సరైన మోతాదులో విడుదల కావడానికి అయోడిన్ చాలా అవసరం. అయితే అయోడిన్ లోపాలున్న పిల్లలు అత్యధికంగా దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే 82.5% ఉన్నట్లు చిల్డ్రన్ ఇన్ ఇండియా నివేదిక తెలిపింది. దీనిలోపంతో పిల్లల్లో ఎదుగుదల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చేపలు, సముద్ర ఆహారం, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది.
News November 12, 2025
ఆస్పత్రిలో చేరిన మరో సీనియర్ నటుడు

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద(61) ముంబై క్రిటికేర్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న దిగ్గజ నటుడు ధర్మేంద్రను నిన్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన గోవింద ఇంట్లో రాత్రి సమయంలో కుప్పకూలిపోయారు. దీంతో అర్ధరాత్రి ఒంటిగంటకు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ తెలిపారు. ఆయనకు పలు టెస్టులు చేశారని, వాటి రిజల్ట్స్ వస్తే అనారోగ్యానికి కారణం తెలుస్తుందన్నారు.


