News June 5, 2024
NOTAకు 63 లక్షల ఓట్లు!

లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాకు 63,72,220 ఓట్లు పోలైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా బిహార్లో 8.97లక్షల ఓట్లు నోటాకు పడ్డాయని తెలిపింది. యూపీలో 6.34లక్షలు, మధ్యప్రదేశ్లో 5.32L, ప.బెంగాల్లో 5.22L, తమిళనాడులో 4.61లక్షలు, గుజరాత్ లో 4.49లక్షలు, మహారాష్ట్రలో 4.12L, ఏపీలో 3.98L, ఒడిశాలో 3.24లక్షల మంది ఓటర్లు నోటాకు వేశారు. 2019 ఎన్నికల్లో 65.22L ఓట్లు పడగా, ఈసారి ఆ సంఖ్య 2L తగ్గింది.
Similar News
News December 13, 2025
హనుమాన్ చాలీసా భావం – 37

జై జై జై హనుమాన గోసాయీ|
కృపా కరహు గురు దేవ కీ నాయీ||
గురువు మన అజ్ఞానాన్ని తొలగించి జీవితానికి సరైన మార్గం చూపిస్తారు. అలాగే హనుమంతుడు కూడా ఆ గురువులాగే దయ చూపి మనల్ని కష్టాల కడలి నుంచి తప్పిస్తాడు. ధైర్యాన్ని, సన్మార్గాన్ని ప్రసాదించి, నిరంతరం మనల్ని రక్షిస్తూ విజయం చేకూరేలా ఆశీర్వదిస్తాడు. ఈ శ్లోకం ద్వారా తులసీదాస్ హనుమకు జయం పలికి, ఆయన శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 13, 2025
కేరళలోనూ వికసిస్తున్న కమలం!

కేరళ రాజకీయాల్లో BJP ప్రభావం క్రమంగా పెరుగుతోంది. తాజా లోకల్ బాడీ ఎన్నికలలో తిరువనంతపురం కార్పొరేషన్లో బీజేపీ నేతృత్వంలోని NDA విజయ ఢంకా మోగించింది. మొత్తం 101 వార్డులలో ఎన్డీయే 50 గెలవగా, LDF 29, UDF 19 సాధించాయి. ఇప్పటికే 2024 LS ఎన్నికల్లో త్రిసూర్ నుంచి నటుడు, BJP నేత సురేశ్ గోపి MPగా గెలిచారు. ఆ పార్టీ ఇప్పుడు కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. ఇది కేరళలో కమలం వికాసాన్ని సూచిస్తోంది.
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <


