News January 24, 2025
650 పోస్టులు.. ఎంపికైన వారి లిస్టు విడుదల

TG: అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ లిస్టును TGPSC విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ప్రొవిజినల్ లిస్టును <
Similar News
News December 18, 2025
భారత్కు మొదటి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం

ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగిన ఫైనల్ పోటీల్లో కర్ణాటకకు చెందిన విద్యా సంపత్ మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా నిలిచారు. మంగళూరుకు చెందిన విద్య ముంబయిలో పుట్టి పెరిగారు. ఈ పోటీల్లో జాతీయ పక్షి నెమలి, జాతీయ ప్రాణి పులి, జాతీయ పుష్పాన్ని పోలిన వస్త్రాలను ధరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. 22 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీపడి భారత్కు మొదటి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం అందిచారు విద్య.
News December 18, 2025
కాసులు కురిపిస్తున్న మల్లెల సాగు

AP: మల్లె పూల సాగు రైతులకు, రాష్ట్రానికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. మల్లె సాగు ద్వారానే వ్యవసాయ రంగంలో రూ.10,749 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగ స్థూల విలువ జోడింపులో ఇది 6.06 శాతంగా ఉంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మల్లె సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. మిగిలిన జిల్లాల రైతులు కూడా మల్లెసాగుపై దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
News December 18, 2025
నితీశ్ కుమార్కు పాక్ గ్యాంగ్స్టర్ బెదిరింపులు!

బిహార్ CM నితీశ్ కుమార్కు పాకిస్థాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. మహిళా డాక్టర్ హిజాబ్ <<18574954>>లాగిన<<>> ఘటనపై నితీశ్ క్షమాపణలు చెప్పాలని పాక్ గ్యాంగ్స్టర్ షహ్జాద్ భట్టి డిమాండ్ చేశాడు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సోషల్ మీడియాలో హెచ్చరించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డాడు. ఈ బెదిరింపు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతానికి వివరాలేమీ లేవని DGP వినయ్ కుమార్ తెలిపారు.


