News November 20, 2024
ఝార్ఖండ్లో 67.59%.. MHలో 58% పోలింగ్

ఝార్ఖండ్లో రెండో విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 38 స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు 67.59% పోలింగ్ జరిగింది. అటు మహారాష్ట్రలో 58.22% ఓటింగ్ నమోదైంది. అర్బన్ ప్రాంతాల్లోని ఓటర్లు ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపినట్టు లేదు. ముంబై సిటీలో 49%, ముంబై సబ్అర్బన్లో 51% ప్రజలు మాత్రమే ఓటేశారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ, వయనాడ్ సహా ఇతర ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సాయంత్రం 6.30కి వెలువడనున్నాయి.
Similar News
News November 14, 2025
వ్యవసాయంలో ‘ఫర్టిగేషన్’ అంటే ఏమిటి?

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News November 14, 2025
‘ఫర్టిగేషన్’లో ఎరువులను ఎలా అందించాలి?

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.
News November 14, 2025
కిషన్ రెడ్డి సచివాలయానికి రావాలని ఆహ్వానిస్తున్నా: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కిషన్ రెడ్డి తానే స్వయంగా అభ్యర్థిగా మారినా డిపాజిట్ దక్కించుకోలేకపోయారని CM రేవంత్ ఎద్దేవా చేశారు. ‘భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కంపించి మనల్ని అలర్ట్ చేస్తుంది. మనం తేరుకోకపోతే భూగర్భంలో కలిసిపోతాం. ఇవాళ్టి ఫలితం BJPకి అలాంటి ఇండికేషనే. కిషన్ రెడ్డి తేరుకోవాలి. ఆయన సచివాలయానికి రావాలని రాష్ట్ర CMగా ఆహ్వానిస్తున్నా. మహానగరం అభివృద్ధికి సహకరించాలి’ అని కోరారు.


