News November 20, 2024
ఝార్ఖండ్లో 67.59%.. MHలో 58% పోలింగ్

ఝార్ఖండ్లో రెండో విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 38 స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు 67.59% పోలింగ్ జరిగింది. అటు మహారాష్ట్రలో 58.22% ఓటింగ్ నమోదైంది. అర్బన్ ప్రాంతాల్లోని ఓటర్లు ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపినట్టు లేదు. ముంబై సిటీలో 49%, ముంబై సబ్అర్బన్లో 51% ప్రజలు మాత్రమే ఓటేశారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ, వయనాడ్ సహా ఇతర ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సాయంత్రం 6.30కి వెలువడనున్నాయి.
Similar News
News December 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 2, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 2, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.06 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 2, 2025
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి: YCP

AP: CBN ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో అవి కొండల్లా పేరుకుపోతున్నాయని YCP ఆరోపించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి భారీగా నిధులు పేరుకుపోయాయని విమర్శించింది. ఫీజ్ రీయింబర్స్మెంట్ కింద రూ.5,600కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు రూ.2,200కోట్లు బకాయిలున్నట్లు తెలిపింది. దీంతో విద్యార్థులకు చదువుతో పాటు భోజనం కూడా దక్కని పరిస్థితి నెలకొందని ట్వీట్ చేసింది.


