News October 9, 2025
ఆర్మీ DG EMEలో 69 పోస్టులు

ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్(DG EME) 69 పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్, MTS, LDC, JTTI పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు JTTI పోస్టులకు 30, మిగతా పోస్టులకు 25ఏళ్లు. రాతపరీక్ష, స్కిల్, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://indianarmy.nic.in/
Similar News
News October 9, 2025
ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి స్టే నిదర్శనం: కిషన్ రెడ్డి

TG: BC రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు లబ్ధి చేకూర్చాలని కాకుండా రాజకీయ ప్రయోజనం కోసం అసంబద్ధ బిల్లు, GO తీసుకొచ్చి డ్రామా చేస్తోందన్నారు. అటు ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదని TBJP చీఫ్ రామ్చందర్రావు, MP ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే 50% పరిమితి పెట్టి ఇప్పుడు పెంపు అనడం CM అవగాహన లేమికి నిదర్శనమన్నారు.
News October 9, 2025
హైకోర్టు ఆదేశాలు పాటిస్తాం: ఎన్నికల సంఘం

స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సింగిల్ సెంటెన్స్తో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్పై న్యాయస్థానం స్టే విధించడంతో పాటు SEC కూడా దీనికి అంగీకరించడంతో ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేనట్లేనని స్పష్టమవుతోంది.
News October 9, 2025
జాన్సన్ & జాన్సన్కు రూ.8వేల కోట్ల జరిమానా!

ఫార్మా దిగ్గజం ‘జాన్సన్ & జాన్సన్’కు టాల్కమ్ పౌడర్ సంబంధిత కేసులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పౌడర్ వాడిన 88ఏళ్ల మే మూర్ 2021లో మెసోథెలియోమా అనే అరుదైన క్యాన్సర్తో చనిపోయారు. బాధితురాలి కుటుంబీకులు USA కోర్టుని ఆశ్రయించగా సుదీర్ఘ విచారణ తర్వాత కంపెనీకి $966 మిలియన్ల (రూ. 8,000 కోట్లు) భారీ జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై సంస్థ అప్పీల్కు వెళ్లనుంది. ఇప్పటికే సంస్థపై 63వేల కేసులు నమోదయ్యాయి.