News September 5, 2025
7న కాణిపాకం ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా కాణిపాకం వరసిద్ధుడి ఆలయాన్ని ఈనెల 7వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి మూసి వేయనున్నట్లు ఈవో పెంచలకిషోర్ వెల్లడించారు. గ్రహణం విడిచిన తర్వాత 8వ తేదీ ఉదయం 4 గంటలకు ఆలయం శుద్ధి చేస్తామన్నారు. స్వామికి అభిషేకం చేసి ఉదయం 6గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. కాణిపాకంలోని మణికంఠేశ్వరస్వామి, వరదరాజస్వామి ఆలయాలను సైతం క్లోజ్ చేస్తారు.
Similar News
News September 5, 2025
చిత్తూరు జిల్లాలో ఇంటర్ పూర్తి చేశారా?

చిత్తూరు జిల్లాలో ఉచిత పారామెడికల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO సుధారాణి తెలిపారు. ఇంటర్లో 40శాతం మార్కులతో పాసైన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న ఈనెల 8వ తేదీలోపు అఫ్లికేషన్ ఫిల్ చేసి చిత్తూరులోని DMHO ఆఫీసులో సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు www.appmb.co.in వెబ్సైట్ చూడాలన్నారు.
News September 4, 2025
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్కు ఐదేళ్ల జైలు శిక్ష

ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడ్డ నిందితుడికి తిరుపతి రెడ్ శాండిల్ స్పెషల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. 2018 జూన్ లో వెదురుకుప్పం మండలం పచ్చికాపలం- తిరుపతి రోడ్డులో వాహనాల తనిఖీ సమయంలో సత్యవేడు మండలానికి చెందిన మహేంద్ర పట్టుపడ్డాడు. నేరం రుజువు కావడంతో గురువారం శిక్ష విధించారు.
News September 4, 2025
KPM: నీళ్లు ఆగిపోయాని ప్రచారం.. కేసు నమోదు

హంద్రీనీవా కాలువలో నీళ్లు రావడం లేదని ప్రచారాలు చేసిన వారిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలతో పాటు X వేదికగా పోస్టులు పెట్టిన వారిని గుర్తించినట్లు కుప్పం అర్బన్ సీఐ శంకరయ్య వెల్లడించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని తప్పుడు కథనాలు, పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.