News May 21, 2024

రూ.7.08కోట్ల విదేశీ నిధులు సేకరించిన ఆప్: ఈడీ

image

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విదేశీ నిధుల సేకరణలో అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. 2014 నుంచి 2022 వరకు రూ.7.08 కోట్ల విదేశీ నిధులను పొందినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్‌లను ఆప్ ఉల్లంఘించినట్లు పేర్కొంది. కెనడాలో సేకరించిన నిధులను ఆ పార్టీ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌తో సహా మరికొందరు తమ స్వప్రయోజనాలకు వాడుకున్నారని తెలిపింది.

Similar News

News February 16, 2026

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి పొనుగుపాటి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పొనుగుపాటి శ్రీనివాస్ వరుసగా రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ తనను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారని శ్రీనివాస్ తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి తనకు అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

News February 16, 2026

చంద్రబాబువి విజనరీ ఆలోచనలు: బిల్ గేట్స్

image

AP: తాను కలిసిన ప్రపంచ నేతలతో పోలిస్తే చంద్రబాబువి విజనరీ ఆలోచనలని బిల్ గేట్స్ కితాబిచ్చారు. ‘ఈ విషయాన్ని CBNతో జరిగిన తొలి భేటీలోనే గ్రహించాను. ఆయన ITని ప్రమోట్ చేయడం వల్లే HYD నుంచి నిపుణులు తయారయ్యారు. డిజిటల్ విప్లవంలో మోదీ, CBN కీలకపాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులకు సరైన విద్యాబోధన చేయడానికి AI తోడ్పడుతుంది. వ్యవసాయంలో Ai వాడుక మంచి పరిణామం’ అని సెక్రటేరియట్‌లో జరిగిన సమావేశంలో తెలిపారు.

News February 16, 2026

TGలో మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ల ఎన్నిక UPDATES

image

* నిర్మల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య(INC), వైస్ ఛైర్మన్‌గా అప్పాల గణేశ్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ భార్యాభర్తలు.
* జగిత్యాల(D) మెట్‌పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్‌గా లింబాద్రి(INC) ఎన్నికయ్యారు. 26 వార్డులకు గాను కాంగ్రెస్ కేవలం 6 సీట్లే గెలుచుకుంది. అయితే పలువురు ఇండిపెండెంట్లు, ఒక బీజేపీ సభ్యుడి మద్దతుతో ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.