News February 1, 2025

ఏపీకి అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు: రామ్మెహన్

image

AP ప్రజల తరఫున నిర్మలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. YCP ప్రభుత్వంలో జల్ జీవన్ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. 2028 వరకు జల్ జీవన్ పథకం పొడిగింపుతో APకి మేలు జరుగుతుందని ఆయన వివరించారు. రాష్ట్రానికి సముచిత న్యాయం చేసేలా టీమ్ వర్క్ చేస్తామన్నారు. ఎంత వీలైతే అంత రాష్ట్రానికి నిధులు తెస్తామని చెప్పారు. రాష్ట్రంలో అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయని తెలిపారు.

Similar News

News November 18, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

*YCP హయాంలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు చూపించినా MLA పదవికి రాజీనామా చేస్తా: గంటా శ్రీనివాసరావు
*నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్, ఏ2 జగన్మోహన్‌ను ఈ నెల 19 నుంచి 22 వరకు కస్టడీకి అప్పగిస్తూ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు.
*TTD పరకామణిలో చోరీ కేసు దొంగలే సతీశ్ కుమార్‌ను అంతమొందించారు. YS వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించినట్లే సతీశ్ హత్యను ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నారు: మంత్రి పార్థసారథి

News November 18, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

*YCP హయాంలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు చూపించినా MLA పదవికి రాజీనామా చేస్తా: గంటా శ్రీనివాసరావు
*నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్, ఏ2 జగన్మోహన్‌ను ఈ నెల 19 నుంచి 22 వరకు కస్టడీకి అప్పగిస్తూ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు.
*TTD పరకామణిలో చోరీ కేసు దొంగలే సతీశ్ కుమార్‌ను అంతమొందించారు. YS వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించినట్లే సతీశ్ హత్యను ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నారు: మంత్రి పార్థసారథి

News November 18, 2025

దోషులు పాతాళంలో ఉన్నా వదలం: అమిత్ షా

image

ఢిల్లీ బ్లాస్ట్ దోషులు పాతాళంలో ఉన్నా వదలబోమని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలించడం మనందరి బాధ్యతని అన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో జరిగిన 32వ నార్తర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని సృష్టిస్తాయని, ఈ విషయంలో జోనల్ కౌన్సిల్స్ పాత్ర కీలకమని అన్నారు.