News March 18, 2024

నెల్లూరులో 7 సమస్యాత్మక కేంద్రాలు

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 32,746 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 28,080 మంది రెగ్యులర్, 4,666 మంది ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 7 సమస్యాత్మక కేంద్రాలు(సీతారామపురం, నారాయణ రెడ్డిపేట, కలువాయి ఏ, బీ సెంటర్లు, సౌత్ మోపూరు, మర్రిపాడు, రేవూరు) గుర్తించారు. వీటిలో 4 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Similar News

News April 4, 2026

మహిళల రక్షణకు ‘శక్తి’ ఆయుధం: SP అజిత

image

మహిళల రక్షణే ధ్యేయంగా నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ‘శక్తి’ యాప్‌పై శనివారం విస్తృత అవగాహన కల్పించింది. SP అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో పోలీసులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఆపద సమయంలో ఈ యాప్ మహిళలకు ఎలా రక్షణ కవచంలా నిలుస్తుందో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్‌ను ప్రతి మహిళా తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు.

News April 4, 2026

మహిళల రక్షణకు ‘శక్తి’ ఆయుధం: SP అజిత

image

మహిళల రక్షణే ధ్యేయంగా నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ‘శక్తి’ యాప్‌పై శనివారం విస్తృత అవగాహన కల్పించింది. SP అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో పోలీసులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఆపద సమయంలో ఈ యాప్ మహిళలకు ఎలా రక్షణ కవచంలా నిలుస్తుందో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్‌ను ప్రతి మహిళా తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు.

News April 4, 2026

తిరుమల: భక్తి ముందు ఓడిన గర్వం..!

image

తిరుమలలో తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి బంగారు పుష్పాలతో అర్చనలు చేస్తూ తనకన్నా గొప్ప భక్తుడు లేడని గర్వించేవాడు. ఒకరోజు శ్రీవారి పాదాల చెంత మట్టిపూలు కనిపించాయి. ఆశ్చర్యపోయిన రాజుకు స్వామివారే కుమ్మరి <<19559783>>దాసుడి<<>> భక్తిని వివరించారు. పేదవాడైన అతను భక్తితో మట్టిపూలు సమర్పించేవాడు. నిజమైన భక్తి సంపదలో కాదు, మనసులో ఉందని గ్రహించిన తొండమాన్ వినమ్రుడయ్యాడు. అహంకారాన్ని వీడి భక్తితో స్వామివారి సేవ చేయడం ప్రారంభించాడు.