News November 25, 2024

విజయానికి 7 వికెట్లే..

image

BGTలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్సులో జైస్వాల్, కోహ్లీ సెంచరీలు చేయడంతో అతిథ్య జట్టు ముందు 534 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో AUS 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కొండంత టార్గెట్‌ను ఛేదించడం ఆస్ట్రేలియాకు సవాల్‌గా మారింది. మరోవైపు మిగతా 7 వికెట్లు కూల్చి భారత్‌కు తొలి విజయాన్ని అందించాలని బుమ్రా సేన ఉవ్విళ్లూరుతోంది.

Similar News

News November 27, 2025

కరెంట్ షాక్‌తో కడప జిల్లా యువకుడి మృతి

image

పులివెందులలోని వాసవీ కాలనీలో బుధవారం రాత్రి యువకుడు చైతన్య విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఇంటిలో పిండి గ్రైండింగ్ ఆడిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

News November 27, 2025

MTU 1232.. ముంపు ప్రాంత రైతులకు వరం

image

MTU 1075, స్వర్ణ రకాలతో సంకరణం చేసి MTU 1232ను అభివృద్ధి చేశారు. ఇది మధ్యస్థ సన్నగింజ రకం. నాట్లు వేశాక 14-15 రోజుల వరకు ముంపును తట్టుకోగలదు. పంటకాలం సాధారణంగా 135-140 రోజులు, ముంపునకు గురైతే 140-145 రోజులు. మొక్క ఎత్తు 120 సెం.మీ. అగ్గి తెగులు, దోమపోటు, మాగుడు తెగులును తట్టుకుంటుంది. ఇది సాధారణ భూమిలో ఎకరాకు 40 బస్తాలు, ముంపు ప్రాంతాల్లో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడినిస్తుంది.

News November 27, 2025

డెలివరీ తర్వాత ఈ లక్షణాలున్నాయా?

image

డెలివరీ తర్వాత మహిళల్లో అనేక మార్పులు వస్తాయి. జుట్టు ఎక్కువగా రాలడం, శారీరక మార్పులు, వాపు, మలబద్ధకం, కాళ్లు, పాదాల్లో వాపు వంటి సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించాలంటే పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఇవి కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. కానీ ఎన్ని రోజులైనా వీటి నుంచి ఉపశమనం లభించకపోతే, అశ్రద్ధ చేయకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.