News March 17, 2025
ఫేక్ పాస్పోర్టు, వీసాతో ప్రవేశిస్తే 7 ఏళ్లు జైలు, ఫైన్!

సరికొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారికి చుక్కలు కనిపించడం ఖాయమే. ఫేక్ పాస్పోర్టు లేదా వీసాతో దేశంలోకి ప్రవేశించేవారు, ఉండేవారు, విడిచివెళ్లే వారు గరిష్ఠంగా ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే రూ.10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎయిర్లైన్స్, షిప్స్ ముందస్తుగా ప్రయాణికులు, స్టాఫ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
Similar News
News February 8, 2026
జూన్ 2న కవిత కొత్త పార్టీ ఆవిర్భావం

BRS నుంచి సస్పెన్షన్కు గురైన మాజీ MLC కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న పార్టీ పేరు, జెండా, అజెండాను లాంఛనంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి బృందం భారత ఎన్నికల సంఘాన్ని కలిసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను ప్రారంభించింది. పార్టీ నిర్మాణంపై కసరత్తు ముమ్మరం చేసిన కవిత కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
News February 8, 2026
రేవంత్ అత్యంత దరిద్రపు సీఎం: KTR

TG: చరిత్రలో బూతులు మాట్లాడే ఏకైక CMగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని, ఆయన అత్యంత దరిద్రపు ముఖ్యమంత్రి అని కేటీఆర్ విమర్శించారు. రెండేళ్లుగా KCRను తిట్టడం తప్పించి చేసిందేమీ లేదన్నారు. రోజూ రూ.వందల కోట్లు దోచుకోవడమే ఏకైక అజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాకుంటే కాంగ్రెస్ వాళ్లు మరో మూడేళ్ల దాకా దొరకరని, వారికి బుద్ధి చెప్పాలని తాండూరు సభలో పిలుపునిచ్చారు.
News February 8, 2026
అరటిలో దుంపకుళ్లు తెగులు నివారణ ఎలా?

అరటి పంటలో దుంపకుళ్లు తెగులును నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఆశిస్తే తోటలకు సరిపడా నీరివ్వాలి. తెగులు సోకిన మొక్కలను దుంపలతో సహా తీసేసి తోట బయట చిన్న చిన్న ముక్కలుగా చేసి తగలబెట్టాలి. మొక్కల మొదళ్ల దగ్గర మట్టి బాగా తడిచేలా 25 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ను లీటరు నీటికి కలిపి తడపాలి. పశువుల ఎరువుతో వృద్ధి చేసిన సూడోమోనాస్ను మొక్కల మొదళ్ల దగ్గర వేస్తే తెగులు చాలా వరకు తగ్గుతుంది.


