News September 2, 2024
70 వసంతాలు పూర్తి చేసుకున్న తిరుపతి SVU

తిరుపతిలోని SVU 70 వసంతాలు పూర్తి చేసుకుంది. 1954లో టంగుటూరి ప్రకాశం పంతులు దీనిని ప్రారంభించారు. యూనివర్సిటీ 1000 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనంతో నిండి ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొని ఉంటుంది. ఈ యూనివర్సిటీలో ఎంతో మంది ప్రముఖులు, నాయకులు విద్యాభ్యాసం చేశారు. రాయలసీమలోనే కాదు దేశంలో టాప్ యూనివర్సిటీలో ఒక్కటిగా నిలిచింది. సోమవారం 70 సంవత్సరాల వేడుకలు జరుగనున్నాయి. మీరు SVU చదువుంటే కామెంట్ చేయండి.
Similar News
News February 26, 2026
చిత్తూరు: పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్

పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-5 నుంచి గ్రేడ్-4కు ప్రమోషన్ ఇచ్చారు. చిత్తూరు DPO సుధాకర్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ చేపట్టారు. జిల్లాలో 23 మందికి ప్రమోషన్ రాగా.. అన్నమయ్య జిల్లాలో పదోన్నతి పొంది అదనంగా ఉన్న 14 మందిని చిత్తూరు జిల్లాకు తీసుకున్నారు. తిరుపతి జిల్లాలో 10 మందికి ప్రమోషన్ ఇచ్చారు. పలు గ్రేడ్లలో ఉన్న 10 మందిని చిత్తూరు జిల్లాకు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
News February 26, 2026
చిత్తూరు జిల్లాలో RDOల బదిలీ

కుప్పం RDO శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది రెవిన్యూ డివిజన్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా కుప్పం RDO శ్రీనివాసరాజు, నగరి RDO భవాని శంకర్ను ట్రాన్స్ఫర్ చేసింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి వద్ద రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News February 25, 2026
చిత్తూరు: జాగ్రత్త.. 80 శాతం కల్తీనే.!

మార్కెట్లో 80% పైగా కల్తీ పన్నీర్ విక్రయిస్తున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి జంతువులు తినడానికి కూడా సురక్షితం కాదట. మైదా హీరో రూట్ పౌడర్, కల్తీ పాలు, పామ్ ఆయిల్ నిల్వలతో వీటిని తయారు చేస్తున్నారట. తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తికి నిత్యం వేల మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడి హోటళ్లలో అన్ బ్రాండెడ్ పనీర్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


