News June 23, 2024

జులై 1న రూ.7,000 పింఛన్: TDP

image

AP: పింఛన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెంచిన మొత్తంతో జులై 1న రూ.7,000 పింఛన్ అందజేయనున్నట్లు టీడీపీ ట్వీట్ చేసింది. రూ.వెయ్యి పెంచగా అయిన రూ.4000, గత 3 నెలల పెంపు రూ.3000 కలిపి లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి ఇవ్వనున్నట్లు పేర్కొంది. కొత్త పాసు పుస్తకాలతో పింఛన్ పంపిణీ చేయనున్నట్లు టీడీపీ తెలిపింది.

Similar News

News November 25, 2025

BRSకు నిధుల కొరత.. రూ.15 కోట్లకు తగ్గిన డొనేషన్లు!

image

TG: అసెంబ్లీ ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి, పార్టీ అధినేత KCR ప్రజల్లోకి రాకపోవడం, కవిత ఆరోపణలు, BJPతో విలీన రూమర్లతో రాష్ట్రంలో BRS ఇమేజ్ మసకబారిందని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీకి విరాళాలు భారీగా తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 580.52 కోట్లుగా ఉన్న డొనేషన్లు, ఈ ఏడాది రూ.15 కోట్లకు పడిపోయినట్టు సమాచారం. దీంతో BRS నిధుల లేమితో ఇబ్బంది పడుతోందని టాక్.

News November 25, 2025

మిరపలో జెమిని వైరస్‌ను ఈ లక్షణాలతో గుర్తించండి

image

వాతావరణ మార్పుల కారణంగా కొన్నిచోట్ల మిరపలో జెమిని వైరస్ కనిపిస్తోంది. ఇది ఆశించిన మొక్కల ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలో ఉంటాయి. ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను, ఈనెల మధ్య లేత ఆకుపచ్చగా లేదా పసుపు పచ్చగా మారుతాయి. కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. దీనికి తోడు కొన్నిచోట్ల పచ్చదోమ కూడా కనిపిస్తోంది. దీని వల్ల మొక్క పెరుగుదల, దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది.

News November 25, 2025

మిరపలో జెమిని వైరస్‌ను ఎలా నివారించాలి?

image

జెమిని వైరస్‌ నివారణకు ముందుజాగ్రత్తగా రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించాలి. వ్యాధిసోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలంలో కలుపు మొక్కలను తీసివేయాలి. పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8 నుంచి 10 అమర్చితే రసం పీల్చే పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. జెమిని వైరస్ నివారణకు లీటరు నీటికి పైరిప్రాక్సిపెన్ 1.5ml లేదా పైరిప్రాక్సిపెన్ + ఫెన్‌ప్రోపాత్రిన్ 1ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.