News January 27, 2025

7,106 సమస్యలను పరిష్కరించాం: నంద్యాలకలెక్టర్

image

నంద్యాల జిల్లాలో ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా 2024 జూన్ మాసం నుంచి ఇప్పటివరకు ప్రజల నుంచి వచ్చిన 8,216 అర్జీలలో 7,106 సమస్యలను పరిష్కరించామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 489 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి 3,633 విజ్ఞప్తులను రైతుల నుంచి స్వీకరించి ఇప్పటివరకు 1,483 అర్జీలను పరిష్కరించామని కలెక్టర్ వివరించారు.

Similar News

News November 18, 2025

భీమవరం: ‘సీబీ-సీఐడీ’ పేరుతో మోసం

image

భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని రూ.78 లక్షలు పోగొట్టుకున్నారు. గత నెల 27న సీబీ-సీఐడీ అధికారులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, సిమ్ సమస్యను పరిష్కరించడానికి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగారని ఆయన తెలిపారు. వారి మాటలు నమ్మి వివరాలు చెప్పడంతో, తన ఖాతా నుంచి దఫదఫాలుగా రూ.78 లక్షలను మాయం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 18, 2025

భీమవరం: ‘సీబీ-సీఐడీ’ పేరుతో మోసం

image

భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని రూ.78 లక్షలు పోగొట్టుకున్నారు. గత నెల 27న సీబీ-సీఐడీ అధికారులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, సిమ్ సమస్యను పరిష్కరించడానికి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగారని ఆయన తెలిపారు. వారి మాటలు నమ్మి వివరాలు చెప్పడంతో, తన ఖాతా నుంచి దఫదఫాలుగా రూ.78 లక్షలను మాయం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 18, 2025

ఎన్టీఆర్ జిల్లాలో 1,600 MSME యూనిట్ల లక్ష్యం

image

ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది రూ.260 కోట్లతో 1,600 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా పరిశ్రమల CGM ఎం. మధు తెలిపారు. వీటి ద్వారా 8,500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే 997 యూనిట్లతో 5,045 మందికి ఉపాధి కల్పించామని, మిగిలిన లక్ష్యాన్ని ఆర్థిక సంవత్సరం చివరిలోపు చేరుకుంటామని స్పష్టం చేశారు.