News March 18, 2024

గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు 72.55% మంది హాజరు

image

AP: రాష్ట్రంలో 89 గ్రూప్-1 ఉద్యోగాలకు నిన్న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు APPSC వెల్లడించింది. 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా, 1,26,068 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 91,463 మంది(72.55 శాతం) మంది హాజరైనట్లు పేర్కొంది. త్వరలో కీ విడుదల చేస్తామంది.

Similar News

News March 28, 2025

తెలుగువారే అగ్రస్థానంలో ఉండాలి: CM చంద్రబాబు

image

AP: భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని, వారిలోనూ తెలుగువారు ముందుండాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘తెలుగువారు దూసుకెళ్లాలనేది నా స్వార్థం. దీని కోసం అమరావతిలో క్వాంటమ్ వాలీని ప్లాన్ చేస్తున్నాం. అందులోనే అన్ని సాంకేతికతల్ని ఏర్పాటు చేస్తాం. భారత ప్రభుత్వంతో పాటు ఐఐటీ మద్రాస్, ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్‌టీతో కలిసి పనిచేస్తున్నాం. ఇలాంటిది తీసుకురావడం దేశంలోనే తొలిసారి’ అని వెల్లడించారు.

News March 28, 2025

బిల్ గేట్స్ నాతో మాట్లాడనన్నారు: CM చంద్రబాబు

image

AP: తాను కలుస్తానని మొదటిసారి కోరినప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇష్టపడలేదని CM చంద్రబాబు ‘మద్రాస్ IIT’ ప్రసంగంలో తెలిపారు. ‘రాజకీయ నాయకులతో తనకు పని లేదని ఆయన అన్నారు. ఒప్పించి 45 నిమిషాలు మాట్లాడాను. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. మనమంతా కృషి చేస్తే భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుంది. 2027 నాటికి మూడోస్థానం, 2047 నాటికి అగ్రదేశంగా అవతరిస్తుంది’ అని తెలిపారు.

News March 28, 2025

వేడికి ఆగలేం.. కానీ చెట్లను బతకనీయం!

image

వేసవి వేడి మొదలైంది. బయటితో పోలిస్తే చెట్టు నీడలో ఉష్ణోగ్రత సగటున కనీసం 2 డిగ్రీలు తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ పల్లెటూళ్లలో సైతం ఇంటి ముందు ఖాళీ ఉంటే సిమెంట్‌తో అలికేస్తున్నాం తప్పితే చెట్లను ఎంతమంది పెంచుతున్నాం? ఆకులు రాలతాయనో, వేర్లు ఇంటిని కూల్చేస్తాయనో చాలామందిలో ఆందోళన. కనీసం ఖాళీ స్థలాల్లోనైనా వీలైనన్ని చెట్లు నాటితే భూతాపాన్ని తగ్గించినవారిమవుతాం. వృక్షో రక్షతి రక్షిత:

error: Content is protected !!