News March 18, 2024
గ్రూప్-1 ప్రిలిమ్స్కు 72.55% మంది హాజరు

AP: రాష్ట్రంలో 89 గ్రూప్-1 ఉద్యోగాలకు నిన్న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు APPSC వెల్లడించింది. 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా, 1,26,068 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 91,463 మంది(72.55 శాతం) మంది హాజరైనట్లు పేర్కొంది. త్వరలో కీ విడుదల చేస్తామంది.
Similar News
News November 3, 2025
ఇతిహాసాలు క్విజ్ – 55 సమాధానాలు

1. అయోధ్య నగరాన్ని ‘మను చక్రవర్తి’ నిర్మించారు.
2. విచిత్రవీర్యుని తండ్రి ‘శంతనుడు’.
3. కృష్ణుడు గోవర్ధన గిరిని ‘ఏడు’ రోజులు ఎత్తి పట్టుకున్నాడు.
4. మనిషి శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలను ‘చక్రాలు’ అని అంటారు.
5. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడాన్ని‘మోక్షం’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 3, 2025
APPLY NOW: CCIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) 14 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, పీజీ(ఎకనామిక్స్), బీటెక్, బీఈ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. నెలకు రూ.60వేలు జీతం చెల్లిస్తారు. వెబ్సైట్: https://cci.gov.in
News November 3, 2025
WWC: ప్లేయర్లకు డైమండ్ నెక్లెస్ల బహుమతి!

మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత ప్లేయర్లకు సూరత్(గుజరాత్) వ్యాపారవేత్త, MP గోవింద్ ఢోలకియా స్పెషల్ గిఫ్టులను ప్రకటించారు. భారతీయులు గర్వపడేలా అమ్మాయిలు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని, వారికి వజ్రాల ఆభరణాలు, ఇళ్లకు అమర్చేందుకు సోలార్ ప్యానెళ్లను గిఫ్ట్గా ఇస్తున్నట్టు తెలిపారు. ఈ విజయం మన దేశానికి కొత్తవెలుగులు తెచ్చిందని BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.


