News December 22, 2024
723 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC)లో 723 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి నేటితో గడువు ముగియనుంది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ పాసైనవారు అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.18వేలు-రూ.92,300 మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
Similar News
News November 21, 2025
ఫార్ములా ఈ కేసులో చట్టపరంగానే చర్యలు: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ: ఫార్ములా ఈ కారు రేస్ కేసులో చట్టపరంగానే చర్యలు ఉంటాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన నల్గొండలో స్పందించారు. తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు.
News November 21, 2025
స్వీట్ కార్న్.. కోత సమయాన్ని ఎలా గుర్తించాలి?

తీపి మొక్కజొన్న కండెలపై కొంచెం ఎండిన పీచు, కండెపై బిగుతుగా ఉన్న ఆకు పచ్చని పొట్టు, బాగా పెరిగిన కండె పరిమాణాన్ని బట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ, బాగా పెరిగి, గింజపై గిల్లితే పాలు కారతాయి. ఈ సమయంలో కండెలను కోయడం మంచిది. కోత ఆలస్యమైతే గింజలోని తీపిదనం తగ్గుతుంది. తీపి మొక్కజొన్నను దఫదఫాలుగా విత్తుకుంటే పంట ఒకేసారి కోతకు వచ్చి వృథా కాకుండా పలు దఫాలుగా మార్కెట్ చేసుకోవచ్చు.
News November 21, 2025
భారీగా తగ్గిన వెండి రేటు.. పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ సిల్వర్ రేటు రూ.12,000 పతనమై రూ.1,61,000కు చేరింది. అటు బంగారం ధరల్లోనూ స్వల్ప మార్పులున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,24,480గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.200 ఎగబాకి రూ.1,14,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


