News June 23, 2024
NEET రీఎగ్జామ్కు 750 మంది డుమ్మా

నీట్ రీఎగ్జామ్కు గ్రేస్ మార్కులు కలిపిన వారిలో సగం మంది డుమ్మా కొట్టారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో NTA 1,563 మందికి గ్రేస్ మార్కులు కలిపింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం ఆదేశాలతో గ్రేస్ మార్కులు రద్దు చేసిన NTA ఇవాళ వారికి మళ్లీ పరీక్ష నిర్వహించింది. 1,563 మందిలో 813 మంది హాజరుకాగా 750 మంది గైర్హాజరయ్యారు. మరోవైపు నీట్ పరీక్ష రద్దు చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Similar News
News December 2, 2025
గొర్రెలకు సంపూర్ణ ఆహారం ఎలా అందుతుంది?

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.
News December 2, 2025
CTETకు దరఖాస్తు చేశారా?

CTET అర్హత కోసం అభ్యర్థుల నుంచి CBSE దరఖాస్తులు కోరుతోంది. B.Ed, D.Ed, B.EI.Ed, D.Ed, D.EI.Ed అర్హతగల వారు DEC 18 వరకు అప్లై చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఏకలవ్య స్కూల్స్, రాష్ట్ర స్థాయిలో టీచర్ ఉద్యోగాలకు పోటీపడాలంటే CTET ఉత్తీర్ణత తప్పనిసరి. FEB 8న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200. SC/ST/ PWBDలకు రూ.500, రెండు పేపర్లకు రూ.600. ctet.nic.in/
News December 2, 2025
చర్మ ఆరోగ్యానికి టమాటా

ముఖంపై మచ్చలు, మొటిమలు, గుంతలు వంటి సమస్యలకు టమాటా పరిష్కారం చూపుతుందంటున్నారు చర్మ నిపుణులు. * టమాటా రసం, నిమ్మరసం కలిపి, దీంట్లో దూదిని ముంచి ముఖానికి అప్త్లె చేసుకొని మసాజ్ చేసుకోవాలి. పావుగంట తర్వాత కడిగేస్తే ఓపెన్ పోర్స్ తగ్గుతాయి. *టమాటా రసంలో శనగపిండి, నిమ్మరసం, తేనె కలిపి, ఈ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో రాసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.


