News March 24, 2025

76 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.143 కోట్లు: ఆనం

image

రాష్ట్రంలో 76 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.143 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని మూలాపేట వేణుగోపాలస్వామి దేవస్థానంలో ఆలయ పాలకమండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంశపారంపర్యంగా ఆలయ ధర్మకర్తలుగా పని చేస్తున్నామన్నారు. వేణుగోపాల స్వామి దేవాలయంలో పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Similar News

News November 27, 2025

ఉదయగిరి: విద్యార్థిని చితకబాదిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు

image

ఉదయగిరి బాలాజీ నగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థిపై నిర్వాహకుడు అంజయ్య వాతలు పడేలా కొట్టిన ఘటన చోటుచేసుకుంది. కలిగిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి ఆరో తరగతి నవోదయ ప్రవేశానికి ముందస్తుగా ఈ కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకుంటూ ఇక్కడే వసతి గృహంలో ఉంటున్నారు. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు, నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. అనంతరం వారు విద్యార్థిని ఇంటికి తీసుకువెళ్లారు.

News November 27, 2025

విద్యార్థులతో కందుకూరు MLA సహపంక్తి భోజనం

image

లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకంపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.

News November 27, 2025

విద్యార్థులతో కందుకూరు MLA సహపంక్తి భోజనం

image

లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకంపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.