News March 24, 2025

76 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.143 కోట్లు: ఆనం

image

రాష్ట్రంలో 76 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.143 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని మూలాపేట వేణుగోపాలస్వామి దేవస్థానంలో ఆలయ పాలకమండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంశపారంపర్యంగా ఆలయ ధర్మకర్తలుగా పని చేస్తున్నామన్నారు. వేణుగోపాల స్వామి దేవాలయంలో పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Similar News

News December 16, 2025

నెల్లూరు జిల్లాకు జోన్-4 కేటాయింపు

image

APలోని 26 జిల్లాలను జోన్‌‌ల వారీగా విభజించే క్రమంలో నెల్లూరు జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-4గా చోటుదక్కింది.

News December 16, 2025

నేటి నుంచి పండగ (ధనుర్మాసం ) నెల ప్రారంభం

image

నేటి నుంచి ధనుర్మాసం రావడంతో పండగ నెల ప్రారంభం అయినట్లు ప్రముఖ పండితులు లోకా అనంత వెంకట మురళీధర్ శాస్త్రి తెలిపారు. జనవరి 14న భోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ నిర్వహించనున్నట్లు చెప్పారు. మంచు తెరలు ముద్దాడుతున్న వేళ పల్లె గుండెల్లో సంక్రాంతి సవ్వడి మొదలైంది. పండుగ నెల ప్రారంభం కావడంతో ప్రతి ఇంటి ముందు రంగవల్లిలతో తీర్చిదిద్దునున్నారు. గుమగుమలాడే వివిధ రకాల పిండి వంటలు చేసే పనులు నిమగ్నం అవుతారు.

News December 16, 2025

ఇంకా గోవాలోనే కార్పొరేటర్లు, 18న నెల్లూరుకు రాక

image

నెల్లూరు కార్పొరేషన్లోని కార్పొరేటర్లు అందరూ ఇంకా గోవాలోనే ఉన్నారు. ఆదివారం రాత్రి 38 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు గోవాకు వెళ్లారు. తిరిగి 17వ తేదీ తిరుపతికి వస్తారు. అక్కడి నుంచి 18వ తేదీ ఉదయానికి కౌన్సిల్ సాధారణ సమావేశానికి హాజరవుతారు. అవిశ్వాస తీర్మానం లేకపోవడంతో సాధారణ సమావేశం జరగనుంది.