News March 24, 2025
76 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.143 కోట్లు: ఆనం

రాష్ట్రంలో 76 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.143 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని మూలాపేట వేణుగోపాలస్వామి దేవస్థానంలో ఆలయ పాలకమండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంశపారంపర్యంగా ఆలయ ధర్మకర్తలుగా పని చేస్తున్నామన్నారు. వేణుగోపాల స్వామి దేవాలయంలో పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Similar News
News January 2, 2026
నెల్లూరు జిల్లాలో 16 పీడీ యాక్టులు

నెల్లూరులో 2025లో గంజాయి బ్యాచ్కు ఓ వ్యక్తి బలయ్యాడు. అరుణ తర్వాత మరో లేడీ డాన్ కామాక్షి వెలుగులోకి వచ్చింది. వరుస నేరాలపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. దీంతో పోలీసులు ఎక్కడిక్కడ రౌడీషీట్లు తెరిచారు. 3కంటే ఎక్కువ కేసులు ఉన్నవారిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2025లో మొత్తం 16 మందిపై పీడీయాక్ట్, 34మందిపై గంజాయి కేసులు నమోదు చేసి 102 మందిని రిమాండ్కు పంపారు. 510 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
News January 2, 2026
నెల్లూరు: మీకు పాస్ బుక్ వచ్చిందా..?

నెల్లూరు జిల్లాలో ఈనెల 9వ తేదీ వరకు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో రీసర్వే చేశారు. భూ వివాదాలను పరిష్కరించి కొత్తగా పాస్ పుస్తకాలు ముద్రించారు. రాజముద్రతో ఉన్న వీటిని గ్రామ సభలు నిర్వహించి ప్రజాప్రతినిధుల ద్వారా రైతులకు అందజేస్తున్నారు. జిల్లాకు మొత్తం 1.05 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు చేరాయి. ఈ కొత్త పుస్తకాలు మీకు అంది ఉంటే కామెంట్ చేయండి.
News January 2, 2026
నెల్లూరు కలెక్టర్ సరికొత్త ఐడియా..!

<<18602332>>ఛాంపియన్ ఫార్మర్స్<<>> పేరిట నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కిసాన్ సెల్ ఏర్పాటు చేశారు. శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా <<18725510>>మాట్లాడే <<>>వీలు కల్పించారు. చేపలు, రొయ్యలు, ఆక్వా సాగు సందేహాలపై మత్స్యశాఖ శాస్త్రవేత్త N.తీరజ(9866210891)కు ఉద్యాన పంటలు, విత్తనాల ఎంపికపై ఉద్యానవన శాఖ అధికారిణి లక్ష్మికి(7995088181) కాల్ చేయవచ్చు.


