News December 3, 2024

గంటకు 76 ఓట్లు పడటం అనూహ్యమేమీ కాదు: MH ఎన్నికల అధికారి

image

మహారాష్ట్రలో ఓటింగ్ శాతం అసాధారణంగా పెరగలేదని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి చొక్కలింగం అన్నారు. సాయంత్రం 5-6 గంటల మధ్య 76 లక్షల మంది ఓట్లేశారన్న వార్తలపై స్పందించారు. ‘MHలో లక్ష పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అంటే ఆ గంటలో ఒక్కో స్టేషన్లో సగటున 76 మంది ఓటేశారు. ఆ రోజు మొత్తం ఓటింగ్ సరళి గమనిస్తే గంటకు 60-70 మందే ఓటేశారు. ఇది మామూలే. 2019 డేటాతో గ్రాఫ్‌పై పోలిస్తే పెద్ద గ్రోతేమీ ఉండదు’ అని తెలిపారు.

Similar News

News October 4, 2025

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..

image

ఆస్ట్రేలియాతో ఈనెల 19 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కు BCCI భారత జట్టును ప్రకటించింది. బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. గాయం కారణంగా పంత్, హార్దిక్ దూరమయ్యారు.
టీమ్: గిల్(కెప్టెన్), రోహిత్, కోహ్లీ, శ్రేయస్(వైస్ కెప్టెన్), అక్షర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్, వాషింగ్టన్, కుల్దీప్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్, ధ్రువ్ జురెల్, జైస్వాల్.

News October 4, 2025

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్‌గా గిల్

image

వన్డేల్లో టీమ్‌ ఇండియాకు బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను నియమించింది. రోహిత్‌ను తప్పించి సారథ్య బాధ్యతలను గిల్‌కు అప్పగించింది. ఈనెల 19 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు గిల్ కెప్టెన్సీ వహిస్తారు. అయితే AUS సిరీస్‌కు రోహిత్, కోహ్లీకి జట్టులో చోటు కల్పించారు.

News October 4, 2025

అమెరికాలో 2.3 కోట్ల మంది మిలియనీర్లు!

image

ప్రపంచంలో అత్యధిక మిలియనీర్లు అమెరికాలో ఉన్నట్లు ‘UBS గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025’ తెలిపింది. అక్కడ ఏకంగా 2.3 కోట్ల మంది మిలియనీర్లు ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాత చైనా (63లక్షలు), ఫ్రాన్స్ (29లక్షలు) ఉన్నాయి. ఈ జాబితాలో భారతదేశం 9.17 లక్షల మంది మిలియనీర్లతో 14వ స్థానంలో నిలిచింది. జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ కూడా మొదటి 15 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.