News August 10, 2025
79 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

అనంతపురంలోని క్లాక్ టవర్ నుంచి 79 అడుగుల జాతీయ జెండాతో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విశ్వవిద్యాలయం తరుపున హర్ ఘర్ తిరంగా ర్యాలీని విజయవంతంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Similar News
News November 1, 2025
ఖాళీల భర్తీలు పక్కా ఉండాలి: అనంత కలెక్టర్

ఐసీడీఎస్లో ఖాళీల భర్తీకి నిబంధనల ఉల్లంఘనకు తావులేదని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్)పై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 36 వర్కర్లు, 68 హెల్పర్లు కలిపి మొత్తం 104 పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
News October 31, 2025
పోలీసు అమరవీరులకు జోహార్లు

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు జిల్లా ఎస్పీ జగదీశ్ జోహార్లు తెలిపారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల ముగింపు రోజున శుక్రవారం అనంతపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ జగదీష్, ఇతర పోలీస్ అధికారులు అమర వీరులకు నివాళులర్పించారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ఓపెన్ హౌస్, రక్తదాన శిబిరాలు, వ్యాస రచన పోటీలు, ఉచిత వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు SP తెలిపారు.
News October 30, 2025
మహిళ సూసైడ్ అటెంప్ట్

గుత్తి మండలం అబ్బేదొడ్డినికి చెందిన శిరీష పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి, 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉండాలని శిరీషకు సూచించారు.


