News March 29, 2025

79వేల ఎస్సీ కుటుంబాలకు సోలార్ ప్యానల్స్: కలెక్టర్

image

ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా జిల్లాలో ఉన్న 79 వేల షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు ఏపీ ట్రాన్స్కో బ్యాంకర్ల సమన్వయంతో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ట్రాన్స్కో అధికారులు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో ఇప్పటి వరకు సూర్య ఘర్ పథకానికి అర్హులైన వారి జాబితాపై సమీక్షలు నిర్వహించారు. మూడు నెలల్లోగా ఏర్పాటు చేయాలన్నారు

Similar News

News April 2, 2025

దేశానికి ఇవాళ బ్లాక్ డే: వక్ఫ్ బిల్లుపై షర్మిల

image

AP: మైనారిటీలను అణిచివేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చిందని YS షర్మిల ఆరోపించారు. పార్లమెంట్ ముందుకు ఆ బిల్లు రావడం అంటే దేశానికి ఇవాళ బ్లాక్ డే అని తెలిపారు. వక్ఫ్ బిల్లును దేశంలోని 20కోట్ల మంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య అని అన్నారు. మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు TDP, జనసేన మద్దతు పలకడం దారుణమని మండిపడ్డారు.

News April 2, 2025

కరీంనగర్: భక్తులకు గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు

image

ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు ఆర్టీసీ చేసింది. ఒక్కొక్క ప్యాకెట్‌కు రూ.151, ఆన్‌లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, బుకింగ్ కోసం KNR 91542 98581, 9154298561, GDK 91542 98554, HSB 9154298673, HZB 9154298559, మంథని 9154298554, JGL 7780250439, KRTL 9154298572, MTPL 9154298574, SRCL 9154298576, VMD 9154298574 నంబర్లలో సంప్రదించవచ్చు.

News April 2, 2025

నల్గొండలో భూప్రకంపనలు?

image

నల్గొండలో నిన్న పలుమార్లు భూకంపం వచ్చినట్లు పుకార్లు షికార్లు చేశాయి. పట్టణంలోని HYDరోడ్డు, మీర్‌బాగ్ కాలనీతోపాటు వివిధ ప్రాంతాల్లో భూమి కంపించిదంటూ వాట్సప్‌లలో చక్కర్లు కొట్టడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్ని సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించినట్లు SMలో సైతం వైరలైంది. మీర్‌బాగ్ కాలనీవాసులు మాత్రం అసలు అలాంటిది ఏమి లేదని తెలిపారు. ఇదంతా పుకారేనని తెలియడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

error: Content is protected !!