News December 3, 2024
8న మెదక్కి రానున్న గరికపాటి నరసింహ రావు

మహా సహస్ర అవధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.గరికపాటి నరసింహ రావు ఈనెల 8న మెదక్ పట్టణానికి రానున్నారు. శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శ్రీ ఫ్యాక్టరీ హనుమాన్ దేవాలయంలో ఉదయం నుంచి చందన నిర్మాల్య విసర్జన తదుపరి పునః శ్రీ చందనోత్సవం, మహాకుంభాభిషేకం ఉన్నట్లు ఆలయ పూజారి కరణం ప్రభాకర్ శర్మ తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.
Similar News
News December 11, 2025
BREAKING: పాపన్నపేట మండలంలో తొలి విజయం

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దౌలాపూర్ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు రేషబోయిన అంజయ్య విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి సునీత మీద 9 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
News December 11, 2025
మెదక్: మధ్యాహ్నం 1 గంట వరకు 86 % పోలింగ్

మెదక్ జిల్లాలో మధ్యాహ్నం 1 గంట వరకు 86 % పోలింగ్ నమోదైంది. ఇంకా అనేక చోట్ల ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ పూర్తయ్యాక సిబ్బంది మధ్యాహ్న భోజనం తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదటి విడతలో ప్రధానంగా హవేలి ఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, పెద్ద శంకరంపేటలో పోలింగ్ కొనసాగుతుంది.
News December 11, 2025
మెదక్: సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

కలెక్టరెట్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా వివిధ మండలాల పోలింగ్ సరళిని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. అల్లాదుర్గ్-10, హవేలి ఘన్పూర్-10 పాపన్నపేట-14, రేగోడు-12, పెద్ద శంకరంపేట-14, టేక్మాల్-14 క్రిటికల్, సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించి, వాటిని కలెక్టర్ కార్యాలయంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నేరుగా వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.


