News December 24, 2024

8.3 కోట్ల బిర్యానీలు తినేశారు!

image

స్విగ్గీ 2024కు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. జనవరి 1 నుంచి నవంబర్ 22 వరకు 83 మిలియన్ల ఆర్డర్‌లతో బిర్యానీ అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా నిలిచింది. అందులోనూ హైదరాబాద్‌లో అత్యధికంగా 9.7 మిలియన్లు, బెంగళూరులో 7.7Mn ఆర్డర్స్ వచ్చాయి. ఇక 23Mn ఆర్డర్లతో దోశ రెండో డిష్‌గా నిలిచింది. కాగా అర్ధరాత్రి 12-2 మధ్యలో అధికంగా బిర్యానీలే బుక్ అయ్యాయి. ఇంతకీ మీరేం ఆర్డర్ చేశారు?

Similar News

News September 22, 2025

రెండు రోజుల క్రితం లేఖ.. ఇవాళ హతం

image

ఆయుధాలు వదిలే ప్రసక్తే లేదంటూ ప్రకటించిన రెండు రోజులకే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా <<17796054>>రామచంద్రారెడ్డి<<>> ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఆయుధాలు వదిలేస్తామంటూ అభయ్ పేరుతో ఇటీవల లేఖలు కలకలం రేపాయి. ఆ ప్రకటన పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ఈ నెల 20న లేఖ విడుదల చేశారు. అది తాజాగా బయటకు రావడం, ఆయన మరణించడం చర్చనీయాంశమైంది.

News September 22, 2025

పవన్ ‘OG’కి ‘A’ సర్టిఫికెట్.. 1AM షో క్యాన్సిల్

image

‘OG’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే అని అర్థం. మూవీలో విపరీతమైన వైలెన్స్ కారణంగానే A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా రన్ టైమ్‌ను 2.34 గంటలకు(154ని. 15 సెకన్లు) లాక్ చేశారు. అటు ఏపీలో 25న 1AM షోను క్యాన్సిల్ చేసి 24న రాత్రి 10 గం.ల ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.

News September 22, 2025

పరకామణిపై CBI విచారణ చేయాలి: YCP

image

AP: తిరుమల <<17772428>>పరకామణి<<>> వివాదంపై CBI విచారణ, SC నేతృత్వంలో జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని YCP డిమాండ్ చేసింది. CJI గవాయ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వైసీపీ MP గురుమూర్తి లేఖలు రాశారు. హుండీ సొమ్ము చోరీ జరిగిందన్న ఆరోపణల వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఉన్నాయన్నారు. సరైన ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే తిరుమలను పవిత్రంగా భావించే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అసహనం వ్యక్తం చేశారు.