News July 14, 2024

గత 3-4ఏళ్లలో 8 కోట్ల జాబ్స్ క్రియేట్ అయ్యాయి: పీఎం మోదీ

image

భారత్‌లో గత 3-4ఏళ్లలో కొత్తగా 8 కోట్ల జాబ్స్ క్రియేట్ అయ్యాయని PM మోదీ తెలిపారు. ఈ విషయం RBI ఇటీవల రిలీజ్ చేసిన రిపోర్టులో వెల్లడైందన్నారు. నిరుద్యోగం పేరిట కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ రిపోర్టులో వారి నోళ్లన్నీ మూతపడ్డాయని వ్యాఖ్యానించారు. ముంబైలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. NDA ప్రభుత్వం మాత్రమే దేశంలో స్థిరమైన పాలనను అందించగలదని పేర్కొన్నారు.

Similar News

News December 29, 2025

ఇతిహాసాలు క్విజ్ – 111 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: మహాభారతంలో పాండవుల కోసం మయసభను నిర్మించింది ఎవరు? రామాయణంలో ఆయన పాత్ర ఏంటి?
సమాధానం: మహాభారతంలో పాండవుల కోసం అద్భుతమైన మయసభను నిర్మించింది మయాసురుడు. ఈయన గొప్ప అసుర శిల్పి. రామాయణంలో ఈయన రావణుడికి మామగారు. రావణుడి భార్య మండోదరి తండ్రి మయాసురుడే. ఆయన రామాయణ కాలంలో అసురులకు భవనాలు, నగరాలను నిర్మించే శిల్పిగా కూడా ప్రసిద్ధుడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 29, 2025

నటి మాధవీలతపై కేసు నమోదు

image

నటి మాధవీలతపై HYDలోని సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. SMలో సాయిబాబాపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్లపైనా కేసు పెట్టారు. వీరి పోస్టులు ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశాయని ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని ఆదేశించారు. అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

News December 29, 2025

రాయచోటి ప్రజలకు క్షమాపణలు: మంత్రి రాంప్రసాద్

image

AP: రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడంతో <<18702293>>కన్నీళ్లు<<>> పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ అంశంపై తొలిసారి స్పందించారు. స్థానిక ప్రజలకు క్షమాపణ చెప్పారు. రాయచోటి ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టబోనని స్పష్టం చేశారు. ప్రజలు ఏడాదిలో ఈ బాధ నుంచి బయటపడేలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడనని, విమర్శలకు సరైన రీతిలో సమాధానం ఇస్తానన్నారు.