News February 25, 2025

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

image

AP: తిరుమలలో టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనం కోసం 8 గంటలు పడుతోంది. 4 కంపార్ట్‌‌మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,764 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 23,504 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.14కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. నిన్న 4.8లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను TTD రిలీజ్ చేయగా 20 నిమిషాల్లోనే బుక్ అయ్యాయి.

Similar News

News February 25, 2025

సీఎం చంద్రబాబును కలిసిన వీహెచ్

image

AP: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. నిన్న విజయవాడలో ఆయనను కలిసి.. ఏపీలోని ఒక జిల్లాకు దివంగత సీఎం దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని, స్మృతివనం నిర్మించాలని కోరారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, దళిత సీఎం అయిన సంజీవయ్య అత్యంత నిజాయితీపరుడని వీహెచ్ పేర్కొన్నారు.

News February 25, 2025

అనైతిక లేఆఫ్స్: వెనక్కి తగ్గిన ఇన్ఫోసిస్!

image

ట్రైనీ ఇంజినీర్ల అసెస్మెంట్ టెస్టును ఇన్ఫోసిస్ నిరవధికంగా వాయిదా వేసింది. మైసూర్ క్యాంపస్‌లో 350 మందిని తొలగించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది. OCTలో కంపెనీ 1000 మందిని నియమించుకుంది. వారు 3 దఫాల్లో అసెస్మెంట్ క్లియర్ చేయకుంటే ఇంటికెళ్లాల్సిందే. మొన్న ట్రైనీలను తొలగించిన <<15417347>>తీరు<<>>, ఈ అంశం లేబర్ మినిస్ట్రీకి చేరడం, దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కంపెనీ మూడో అటెంప్టు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

News February 25, 2025

ముగ్గురిని చంపేసిన గజరాజులు.. కుంకీ ఏనుగులు ఎక్కడ?

image

AP: అన్నమయ్య (D)లో నేడు ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోయారు. అటు పార్వతీపురం మన్యం(D) జియ్యమ్మవలస(M)లో రైస్ మిల్లులోని ధాన్యం, బియ్యాన్ని గజరాజులు చెల్లాచెదురు చేశాయి. దీంతో కుంకీ ఏనుగులు ఎక్కడ? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రజలకు నష్టం జరగకుండా గజరాజులను కుంకీ ఏనుగులతో తరిమేస్తామన్న ప్రభుత్వం ఏం చేస్తోందని బాధితులు నిలదీస్తున్నారు. మరో ప్రాణం పోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

error: Content is protected !!