News February 26, 2025
శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65,127 మంది భక్తులు దర్శించుకోగా, 19,307 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు సమకూరింది.
Similar News
News November 20, 2025
ఆవుల డెయిరీ, గేదెల డెయిరీ.. దేనితో లాభం?

స్థానికంగా ఆవు, గేదె పాలకు ఉన్న డిమాండ్ బట్టి ఫామ్ ప్రారంభించాలి. గేదె పాలకు అధిక ధర వస్తున్నా, స్థానిక గేదెలు తక్కువ పాలివ్వడం, అధిక పాలిచ్చే ముర్రాజాతి గేదెల ధర ఎక్కువ కావడం, సకాలంలో ఎదకు రాకపోవడంతో చాలా మంది నష్టపోతున్నారు. అందుకే ఏడాదిలో 280-300 రోజుల పాటు అధిక పాల దిగుబడినిచ్చే జెర్సీ, హోలిస్టిన్ ఫ్రీజియన్ ఆవులతో ఫామ్ నడపడం మేలంటున్నారు నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.
News November 20, 2025
ఆవులతో డెయిరీఫామ్ ఎందుకు మేలంటే?

హోలిస్టిన్ ఫ్రీజియన్ జాతి ఆవులు ఒక ఈతకు 3000 నుంచి 3500 లీటర్ల పాలను ఇస్తాయి. వీటి పాలలో వెన్నశాతం 3.5-4% ఉంటుంది. జెర్సీ జాతి ఆవు ఒక ఈతకు 2500 లీటర్ల పాలనిస్తుంది. పాలలో వెన్నశాతం 4-5% ఉంటుంది. ఒక ఆవు ఏడాదికి ఒక దూడను ఇస్తూ.. మనం సరైన దాణా, జాగ్రత్తలు తీసుకుంటే 10 నెలలు కచ్చితంగా పాలిస్తుంది. ఒక ఆవు రోజుకు కనీసం 12-13 లీటర్లు పాలిస్తుంది కనుక పాడి రైతుకు ఏడాదిలో ఎక్కువ కాలం ఆదాయం వస్తుంది.
News November 20, 2025
తప్పుల సవరణకు ఈ ఒక్కరోజే ఛాన్స్!

TG: గ్రామ పంచాయతీలు, వార్డు ఓటరు జాబితాలో <<18333411>>తప్పులు<<>> ఉంటే సవరించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పొరపాట్ల సవరణకు ఈ ఒక్కరోజు మాత్రమే ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 22న జిల్లా పంచాయతీ అధికారులు వాటిని పరిశీలించి పరిష్కరిస్తారని SEC పేర్కొంది. 23న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. https://tsec.gov.in/లోకి వెళ్లి మీ పేరును చెక్ చేసుకొని తప్పులుంటే GPలో సంప్రదించాలి.


