News June 20, 2024
నేడు 8మంది మంత్రుల బాధ్యతల స్వీకరణ
AP: నేడు రాష్ట్ర సచివాలయంలో 8మంది మంత్రులు తమ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. కార్మిక మంత్రిగా వాసంశెట్టి సుభాష్, జలవనరుల మంత్రిగా నిమ్మల రామానాయుడు, పరిశ్రమల మంత్రిగా టీజీ భరత్, దేవాదాయశాఖ మంత్రిగా ఆనం రాంనారాయణ రెడ్డి, బీసీ సంక్షేమ మంత్రిగా సవిత, ఎంఎస్ఎంఈ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, రెవెన్యూ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేశ్ బాధ్యతల్ని చేపట్టనున్నారు.
Similar News
News October 8, 2024
JK 90/90: కాంగ్రెస్ 9, NC 39 స్థానాల్లో లీడింగ్
జమ్మూకశ్మీర్లో 90 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ 56కు 39, కాంగ్రెస్ 39కి 9 స్థానాల్లో ఆధిక్యం లభించింది. CPM, JJNNP చెరో స్థానంలో లీడింగ్లో ఉన్నాయి. మొత్తంగా ఈ కూటమి 49 స్థానాల్లో దూకుడు కొనసాగిస్తోంది. అంటే మ్యాజిక్ ఫిగర్ను దాటేసినట్టే లెక్క. LG ఐదుగుర్ని నామినేట్ చేసినా వారికి ఫర్వాలేదు. BJP 62 చోట్ల పోటీ చేయగా 29 స్థానాల్లో ముందంజలో ఉంది. PDP 81కి 4 చోట్ల ముందుంది.
News October 8, 2024
రెండు చోట్లా ఆధిక్యంలో ఒమర్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పోటీ చేసిన రెండు చోట్లా ఆధిక్యంలో ఉన్నారు. బుద్గాం, గందర్బల్ రెండు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేశారు. కాగా లీడింగ్పై స్పందించిన ఒమర్ ఫలితాలపై ఇప్పుడే అంచనాకు రాలేమన్నారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాకే ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని పార్టీలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన కాంగ్రెస్ కూటమితో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు.
News October 8, 2024
‘పుష్ప-2’ విడుదల తేదీలో మార్పు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం విడుదల తేదీకంటే ముందే రానున్నట్లు చర్చ జరుగుతోంది. డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఒకరోజు ముందుగానే DEC 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన చేయనున్నట్లు తెలిపాయి.