News September 23, 2024

పిడుగుపడి ఒకే చోట 8 మంది మృతి.. అందులో ఆరుగురు విద్యార్థులు..

image

ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో పిడుగుపాటుకు 8 మంది మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మ‌ృతుల్లో ఆరుగురు విద్యార్థులు కూడా ఉన్నారు. పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులు భారీ వర్షం కారణంగా ఒక చెట్టు కింద తలదాచుకున్నారు. ఈ క్రమంలో చెట్టుపై పిడుగుపడటంతో విద్యార్థులు ‌మృతి చెందినట్టు కలెక్టర్ సంజయ్ అగర్వాల్ ధ్రువీకరించారు.

Similar News

News December 4, 2025

S-500 గురించి తెలుసా?

image

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ ‘ఆపరేషన్ సిందూర్’లో గేమ్ ఛేంజర్‌గా మారింది. దీంతో దాని కంటే శక్తిమంతమైన S-500ను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. S-400 సిస్టమ్ 400కి.మీ దూరంలోని టార్గెట్లను మాత్రమే షూట్ చేయగలదు. కానీ S-500 రేంజ్ 600 కి.మీ కావడం విశేషం. హైపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, లో ఆర్బిట్ శాటిలైట్లను నాశనం చేయగలదు. ఒక్క యూనిట్ ధర సుమారు రూ.20,800కోట్ల వరకు ఉంటుంది.

News December 4, 2025

రాష్ట్రంలో 4 వేల ఖాళీలు!

image

TG: ఎస్సీ గురుకుల సొసైటీలో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా TGSWREISకు 9,735 మంది పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 5,763 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పలు శాఖల్లో అధికారులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థాయిల్లో కలిపి 4,725 ఖాళీలు ఉన్నాయని, వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక శాఖను కోరితే 4వేలకు అనుమతిచ్చిందని సమాచారం.

News December 4, 2025

PCOS వస్తే జీవితాంతం తగ్గదా?

image

పీసీఓఎస్‌ అనేది దీర్ఘకాలిక సమస్యే. కానీ ఆరోగ్యకర జీవనశైలి పాటిస్తే దీన్ని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బరువు అదుపులో ఉండాలి. వ్యాయామం చేయడం మీ జీవనశైలిలో ఒక భాగం కావాలి. హార్మోన్ల అసమతుల్యతను, మెటబాలిక్‌ సమస్యల్ని సరిచేయడానికి వైద్యులను సంప్రదించి మందులు వాడాలి. అలాగే గర్భం నిలవకపోతే అండం విడుదల కోసం కూడా మంచి మందులున్నాయి. కాబట్టి భయపడక్కర్లేదని సూచిస్తున్నారు.