News September 23, 2024

పిడుగుపడి ఒకే చోట 8 మంది మృతి.. అందులో ఆరుగురు విద్యార్థులు..

image

ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో పిడుగుపాటుకు 8 మంది మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మ‌ృతుల్లో ఆరుగురు విద్యార్థులు కూడా ఉన్నారు. పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులు భారీ వర్షం కారణంగా ఒక చెట్టు కింద తలదాచుకున్నారు. ఈ క్రమంలో చెట్టుపై పిడుగుపడటంతో విద్యార్థులు ‌మృతి చెందినట్టు కలెక్టర్ సంజయ్ అగర్వాల్ ధ్రువీకరించారు.

Similar News

News November 30, 2025

ఈ జిల్లాల ప్రజలు బయటకు రాకండి!

image

AP: దిత్వా తుఫాను భారత్ వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA పేర్కొంది. ‘కోస్తాతీరం వెంబడి గంటకు 45-65 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. NLR, TPT జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే బయటికి వెళ్లండి. అత్యవసర సహాయం కోసం నెల్లూరు, కడప, వెంకటగిరిలో NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయి’ అని తెలిపింది.

News November 30, 2025

HER2-పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసా?

image

బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలామందికి తెలుసుగానీ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌ గురించి చాలామంది మహిళలకి తెలియదు. ఇది సాధారణ రొమ్ము కేన్సర్‌ కంటే ప్రమాదకరమైనది. శరీరంలోని ఇతర భాగాలకు సులభంగా వ్యాపిస్తుంది. HER2-పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌ కణ పెరుగుదల, విభజనను ప్రోత్సహించే గ్రాహకమైన HER2 (హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2) ప్రోటీన్ అధికంగా ఉత్పత్తి అవ్వడంతో వస్తుందంటున్నారు నిపుణులు.

News November 30, 2025

HER2-పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స

image

HER2-పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌కు టార్గెటెడ్ థెరపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, హార్మోన్ల చికిత్సను వైద్యులు చేస్తారు. అయితే ఇది తగ్గడం అనేది రోగి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై అవగాహన పెంచుకోవడం, ముందుగానే స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం వల్ల దీని చికిత్స సులువవుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.