News March 23, 2025

రాష్ట్రంలో 8 మంది మృతి

image

TG: రాష్ట్రంలో జరిగిన పలు ఘటనల్లో 8మంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట (D) బీబీగూడెం వద్ద కారు-బస్సు ఢీకొన్నాయి. ఘటనలో కారులోని భార్యాభర్త, పాప(8), మరొకరు చనిపోయారు. మృతుల్లో రవి, రేణుక, రితికను గుర్తించారు. అలాగే, హనుమకొండ- కరీంనగర్ NHపై హసన్‌పర్తి పెద్దచెరువు వద్ద టూవీలర్ను టిప్పర్ ఢీకొట్టగా పవన్, మహేశ్ మృతిచెందారు. నల్గొండ (D) ఏపూరులో ఈతకు వెళ్లి నవీన్(23), రాఘవేంద్ర(20) నీటమునిగి చనిపోయారు.

Similar News

News March 25, 2025

భార్య వీడియోలు షేర్ చేసే అర్హత భర్తకు లేదు: హైకోర్టు

image

భార్యతో సాన్నిహిత్యంగా గడిపిన వీడియోలను ఇతరులకు షేర్ చేసే అర్హత భర్తకు లేదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇది భార్యాభర్తల మధ్య బంధాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. భార్యకు భర్త యజమాని కాదని, ఆమెకంటూ సొంత హక్కులు, కోరికలు ఉంటాయని తెలిపింది. తామిద్దరం కలిసున్న వీడియోలను తన భర్త వీడియో తీసి FBలో అప్‌లోడ్ చేయడంపై ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

News March 25, 2025

Star Health ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌లో తప్పిదాలు..!

image

స్టార్‌హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ ప్రాక్టీసెస్‌లో తప్పిదాలను IRDAI గుర్తించినట్టు తెలిసింది. విచారణ ముగిశాక సంస్థపై చర్యలు తీసుకుంటుందని సమాచారం. 8-10 జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో IRDAI రీసెంటుగా తనిఖీలు చేపట్టింది. క్లెయిమ్స్ తిరస్కరణ, ఆమోదం, లేవనెత్తిన సందేహాలు, డిడక్షన్లను పరిశీలించింది. మరోవైపు స్టార్‌హెల్త్‌కు వేర్వేరు జోనల్ ఆఫీసుల నుంచి 25GST నోటీసులు రావడం గమనార్హం.

News March 25, 2025

ఉచిత ఇళ్లపై సీఎం కీలక ప్రకటన

image

AP: వచ్చే ఐదేళ్లలో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని కలెక్టర్ల సదస్సులో పునరుద్ఘాటించారు. ఇప్పటికే స్థలం పొందిన వారు కోరిన విధంగా ఇంటి పట్టాలు, నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

error: Content is protected !!