News June 19, 2024
ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం నుంచి రూ.80 కోట్లు

TG: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రం రూ.80.10 కోట్లను విడుదల చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దీనికి అదనంగా రాష్ట్రప్రభుత్వం రూ.53.40 కోట్ల ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 59,261 ఎకరాలలో కొత్తగా ఆయిల్ పామ్ సాగులోకి వచ్చినట్లు చెప్పారు. పలు కారణాలతో పెండింగ్లో ఉన్న రూ.100.76 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.
Similar News
News November 22, 2025
HBTUలో 29 టీచింగ్ పోస్టులు

యూపీలోని హర్కోర్ట్ బట్లర్ టెక్నికల్ యూనివర్సిటీ (HBTU) 29 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. MCA, PG, PhD, ME, M.Tech, NET/SET ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://hbtu.ac.in/
News November 22, 2025
రోజూ 30 నిమిషాలు నడిస్తే..!

రోజూ 30 నిమిషాలు నడవడం అత్యంత శక్తివంతమైన ఔషధమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనికి ఖర్చంటూ ఉండదని, దుష్ప్రభావాలు కూడా లేవని సూచించారు. ప్రతిరోజు అరగంట నడిస్తే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, డిప్రెషన్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇది మెరుగైన నిద్ర, ఉల్లాసకరమైన మూడ్ను ఇస్తుందని సూచించారు. SHARE IT
News November 22, 2025
షూటింగ్లో గాయపడిన హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడ్డారు. Eetha మూవీలో ఓ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె ఎడమకాలుకు దెబ్బ తగిలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. ఈ మూవీ లెజెండరీ లావణి నృత్యకారిణి విఠాబాయి బావు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. టైటిల్ రోల్లో శ్రద్ధా నటిస్తున్నారు.


