News June 19, 2024
ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం నుంచి రూ.80 కోట్లు

TG: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రం రూ.80.10 కోట్లను విడుదల చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దీనికి అదనంగా రాష్ట్రప్రభుత్వం రూ.53.40 కోట్ల ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 59,261 ఎకరాలలో కొత్తగా ఆయిల్ పామ్ సాగులోకి వచ్చినట్లు చెప్పారు. పలు కారణాలతో పెండింగ్లో ఉన్న రూ.100.76 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.
Similar News
News October 23, 2025
కఠినంగా వ్యవహరించాల్సిన టైం వచ్చింది: CBN

AP: తిరువూరు <<18082832>>వ్యవహారాన్ని<<>> CM చంద్రబాబు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. దీనిపై పల్లా శ్రీనివాసరావుతో దుబాయ్ నుంచి మాట్లాడినట్లు సమాచారం. ఇద్దరినీ పిలిచి మాట్లాడతానని CMకు పల్లా చెప్పగా.. చర్చించాల్సిన అవసరం లేదని, UAE నుంచి వచ్చాక తానే దృష్టి పెడతానని అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారిద్దరూ అనవసర చర్చకు తావిచ్చారని, కఠినంగా వ్యవహరించాల్సిన టైం వచ్చిందని పల్లాతో CM చెప్పినట్లు సమాచారం.
News October 23, 2025
మరో నాలుగైదు రోజులు వర్షాలు: APSDMA

AP: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, ఏలూరు, ప.గో., NTR, ఉమ్మడి తూ.గో., విశాఖ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
News October 23, 2025
ఈశాన్య మూలలో చెట్లు ఉండకూడదా?

గృహానికి ఈశాన్య దిశలో వృక్షాలు లేకపోవడమే ఉత్తమమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ఈశాన్య కోణం నిర్మలంగా ఉండాలని, అప్పుడే సూర్య కిరణాల ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందని అన్నారు. ‘ఈ మూలలో చెట్లు ఉంటే సూర్యరశ్మికి అడ్డంకి అవుతాయి. సాధారణంగా ఈ దిశలో బావి/బోరు ఉంటాయి. చెట్ల వేళ్లు నేలలోకి చొచ్చుకుపోతే జలం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆ దిశను శుభ్రంగా ఉంచాలి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>