News April 21, 2025
ఏడాదికి 80లక్షల ఉద్యోగాలు సృష్టించాలి: అనంత్ నాగేశ్వరన్

2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే వచ్చే పదేళ్లపాటు ఏడాదికి 80 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ తెలిపారు. కొలంబో ఇండియా సమ్మిట్ 2025లో ఆయన ప్రసంగించారు. తయారీ రంగంలో GDPమరింత పెంచేలా ఉత్పాదకత సాధించాలని, దేశంలోని SMEలను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా అభివృద్ధి ప్రక్రియ ఉండాలన్నారు.
Similar News
News August 7, 2025
120 డిగ్రీలు చేసిన విద్యావేత్త కన్నుమూత

AP: 120 డిగ్రీలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన విద్యావేత్త డా.పట్నాల జాన్ సుధాకర్ (68) అనారోగ్యంతో కన్నుమూశారు. విశాఖ (D) పెందుర్తి (M) పెదగాడిలో జన్మించిన ఆయన తొలుత CBIలో చిన్న ఉద్యోగం చేశారు. తర్వాత సివిల్స్కు ఎంపికయ్యారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ అదనపు డైరెక్టర్గా పనిచేసి రిటైరయ్యారు. ఉద్యోగాలు చేస్తూనే డిగ్రీలు పూర్తి చేశారు.
News August 7, 2025
సెప్టెంబర్ 1 నుంచి జీతాల పెంపు: TCS

తమ ఉద్యోగులకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 1 నుంచి జీతాలు పెంచబోతున్నట్లు ఆ కంపెనీ యాజమాన్యం మెయిల్స్ పంపుతోంది. 80 శాతం ఉద్యోగులకు హైక్ వస్తుందని.. మిడ్, జూనియర్ లెవల్స్ ఇందులో కవర్ అవుతారని పేర్కొంది. కాగా 12 వేల మంది ఉద్యోగులకు తొలగిస్తామని చెప్పిన కొన్ని రోజులకే TCS ఈ ప్రకటన చేయడం గమనార్హం.
News August 7, 2025
స్కూళ్లకు వరుస సెలవులు

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రానున్న 2 వారాల్లో వరుస సెలవులు ఉండనున్నాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఏపీలో ఈ నెల 8న స్కూళ్లకు సెలవు ఉండగా, TGలో ఆప్షనల్ హాలిడే. 9న రెండో శనివారం, ఆగస్టు 10న ఆదివారం సెలవు కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. ఆ తర్వాతి వారంలోనూ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం(హాఫ్ డే స్కూలు), 16న కృష్ణ జన్మాష్టమి, 17న ఆదివారం కావడంతో వరుస సెలవులు ఉంటాయి.